టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ కోసం టీమిండియా 17 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.
దీంతో భారత స్టార్ ప్లేయర్లు.. విరాట్ కోహ్లి, హిట్ మ్యాన్ రోహిత్శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
కోహ్లి మ్యాచ్ ముగిసిన వెంటనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇక ఐపీఎల్లో ముంబై జట్టును ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్శర్మ కూడా టీ20 ఆటకు గుడ్ బై చెప్పారు.
దీంతో ఇప్పుడు భారత్తోపాటు ప్రపంచ క్రికెట్ జట్లలో రిటైర్మెంట్ ప్రకించే ఆటగాళ్లపై చర్చ జరుగుతోంది.
టీమీండియాలో వీరు: టీమిండియాలో రిటైర్ మెంట్ ప్రకటించిన వారిలో రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా ఉన్నారు.
ప్రపంచ ఆటగాళ్లు..: డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా) , న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ , సౌత్ఆఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, బంగ్లాదేశ్కు చెందిన షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మహ్మద్ నబీ
వీరితోపాటు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ కూడా రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడు.