అటల్ సేతు, మహారాష్ట్ర: అటల్ సేతు భారతదేశంలోనే అతి పొడవైన వంతెన. సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెన కూడా ఇదే. ఇది ఆరు వరసల్లో విస్తరించి ఉంది. 21.8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సముద్రంపై 16.5 కిలోమీటర్లు, భూమిపై 5.3 కిలోమీటర్లు పరిధిలో ఈ వంతెనను నిర్మించారు.