అనుష్క శెట్టి గురించి పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు నటిస్తుందంటే ఆ సినిమా పక్కా హిట్ అవ్వాల్సిందే.

కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ రెగ్యూలర్ హీరోయిన్ రోల్స్ చేయడం లేదని స్వీటీ అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మాత్రమే కనిపిస్తుందని.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత కూడా అందుకే సైలెంట్ అయిందని బాధ పడుతున్నారు అభిమానులు.

తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తుంది అను. ఘాతీ సినిమాతో రాబోతున్నా ఈ షూటింగ్ కూడా చాలా సైలెంట్ గా జరుగుతుంది. మలయాళంలో మాత్రం కథనార్ తో రాబోతుంది. ఇది రెండు భాగాలుగా వస్తుంది.

ఇక తెలుగులో 5 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో హిట్ ను సంపాదించారు.

భాగమతి 2 వస్తుందనే ప్రచారం జరిగినా దాని మీద క్లారిటీ లేదు. ఈ సినిమా అశోక్ దర్శకత్వంలో 2018లో విడుదలై విజయం సాధించింది.

భాగమతికి సీక్వెల్ ను తెరకెక్కించాలని మేకర్స్ అనుకుంటున్నా స్వీటీ గ్రీన్ సిగ్నల్  ఇవ్వడం లేదట. మరి జేజమ్మ ఎందుకు ఇలా చేస్తుంది? అని ఆందోళన చెందుతున్నారు అభిమానులు.

అనుష్క సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు చాలా ఉన్నారు. ఇకనైనా తెలుగులో నటిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. మరి ఇంకా పెళ్లి చేసుకోకుండా తెలుగులో కూడా నటించకుండా ఉండటానికి కారణం ఏంటో తెలియడం కష్టమే.