వర్షాకాలంలో జబ్బులు ఎక్కువగా వస్తాయి. దోమల ప్రభావం అధికంగా ఉండటంతో కలరా, మశూచి, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ఎక్కువగా వచ్చే కాలం ఇదే. 

Image Credit : pexels

ఈ కాలంలో మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా వ్యాధులు సోకుతాయి. పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోవడం ద్వారా రోగాలు రాకుండా చేసుకోవచ్చు.

Image Credit : pexels

శుభ్రత : వర్షాకాలంలో శుభ్రతకు పెద్దపీట వేయాలి. ఎటు చూసినా ఈగలే దర్శనమిస్తుంటాయి. దీంతో ఆహారాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

Image Credit : pexels

తాగునీరు : వర్షాకాలంలో నీటి వల్ల చాలా రోగాలు వస్తాయి. వర్షాకాలంలో కొత్తనీరు వస్తుంది. అందుకే నీటిలో క్రిములు ఎక్కువవుతాయి. 

Image Credit : pexels

అందుకే మనం కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమం. నీటిని ఫిల్టర్ చేసుకోవడం మంచిదే. కూరగాయలను కూడా బాగా కడగాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

Image Credit : pexels

ఆహారం విషయంలో : వర్షాకాలంలో ఆహారం త్వరగా పాడవుతుంది. మిగిలిపోయిన ఆహారం తినకపోవడమే బెటర్. పండ్లు, కూరగాయలను కూడా బాగా కడిగిన తరువాతే తినాలి. 

Image Credit : pexels

సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంటేనే తినాలి. అపరిశుభ్రంగా ఉన్న ఆహారాలు తింటే రోగాలు రావడం జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండటమే మన ఆరోగ్యానికి రక్షణ.

Image Credit : pexels

దోమల ద్వారా : దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. వీటి నుంచి రక్షించుకోవడానికి సరైన దుస్తులు ధరించాలి. క్రీములు రాసుకోవాలి. దోమతెరలు వాడాలి.

Image Credit : pexels