మనం ప్రతి రోజు మూడు పూటల ఏదో ఒకటి తింటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా భోజనం చేయడం సహజం.
Image Credit : pexels
భోజనం చేసిన తరువాత కొన్ని పనులు చేయకూడదు. ఒకవేళ చేస్తే దాని వల్ల దుష్ఫలితాలు కలుగుతాయి.
Image Credit : pexels
మనం భోజనం చేసిన తరువాత ఎలాంటి పనులు పెట్టుకోకూడదు. చక్కగా విశ్రాంతి తీసుకుంటే చాలా ఉత్తమం.
Image Credit : pexels
టీ తాగకూడదు : భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు. టీ తాగడం వల్ల యాసిడ్ విడుదలై మనం తిన్న పదార్థం జీర్ణం కాదు. దీంతో గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వస్తాయి.
Image Credit : pexels
సిగరెట్ : భోజనం తరువాత సిగరెట్ కాల్చడం మంచిది కాదు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
Image Credit : pexels
పండ్లు తినకూడదు : భోజనం చేసిన తరువాత పండ్లు తినకూడదు. దీంతో కడుపులో గాలి నిండుతుంది. పండ్లు తినాలనిపిస్తే భోజనానికి గంట ముందు కానీ భోజనం తరువాత గంట అయ్యాక కానీ తినాలి.
Image Credit : pexels
స్నానం : భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. దీని వల్ల కాళ్లు, చేతులకు రక్తసరఫరా ఎక్కువై జీర్ణ ప్రక్రియ ఆగిపోతుంది.
Image Credit : pexels
నిద్రపోకూడదు : తిన్న వెంటనే నిద్ర పోతే కూడా కష్టంగా మారుతుంది. తిన్న ఆహారం జీర్ణం కాదు. గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
Image Credit : pexels