మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అందుకే రోజుకు కనీసం 7-9 గంటలు నిద్రపోవాల్సిందే.
నిద్రలో మన అవయవాలు అన్ని సర్దుకుంటాయి. వాటి మరమ్మతులు అవిచేసుకుంటాయి. దీంతో మరునాడు ఫ్రెష్ గా ఉంటాం.
నిద్రతో మనకు చాలా లాభాలుంటాయి. మన మెదడు కూడా రిలాక్స్ గా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు లేకుండా సేద తీరుతుంది.
అర్థరాత్రి వరకు ఫోన్ చూస్తే నిద్ర మీద కూడా ప్రభావం పడి నిద్ర కరువవుతోంది. ఫలితంగా నిద్ర సమస్య వెంటాడుతోంది. సమయానికి నిద్ర పోకపోతే చాలా నష్టాలు
ఎండాకాలంలో ఉక్కపోతకు సరిగా నిద్రపట్టదు. కూలర్/ఎసీ వేసుకుంటే నిద్ర సరిగా పడుతుంది. నిద్ర సమస్య అసలే ఉండదు.
వర్షాకాలం, చలికాలంలో అయితే నిద్ర బాగా పడుతుంది.
పడక గది కూడా సరిగా ఉండాలి. వెలుతురు లేకుండా చీకటి ఉండేలా చూసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
పగటి పూట ఎక్కువ సేపు నిద్ర పోకూడదు. మధ్యాహ్నం ఎక్కువ సమయం పడుకుంటే రాత్రి సరిగా నిద్ర పట్టక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.