వేసవి ఈసారి ముందే వచ్చింది. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు కొడుతున్నాయి.

ఎండలో పనిచేసేవారు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరం కూడా వేడి చేసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు

వేసవిలో సమస్యలు తలెత్తకుండా  శరీరానికి చల్లదనం ఇచ్చే ఐదు రకాల పండ్లను సూచిస్తున్నారు.

ఖర్బూజా.. ఈ పండులో వాటర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా నిరోధిస్తుంది. డీహైడ్రేషన్‌ కాకుండా చూస్తుంది

పుచ్చకాయ.. ఇక వేసవిలో తీసుకోవాల్సిన మరో పండు పుచ్చకాయ. ఇందులో  కూడా నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది.

మామిడి.. వేసవిలో లభించే సీజనల్‌ ఫ్రూట్‌ మామిడి. ఇది పండ్లకు రాజు.  ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే ఎక్కువగా తింటే శరీరానికి వేడి చేస్తుంది.

బొప్పాయి.. వేసవిలో తీసుకోవాల్సిన మరో పండు బొప్పాయి. ఇందులో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి ఉంటాయి. ఫోలియేట్, ఫైటోకెమికల్స్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

జామ.. వేసవిలో తప్పక తీసుకోవాల్సిన మరో పండు జామ. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  షుగర్‌ పేషెంట్లు కూడా జామ పండు తినవచ్చు.

Off-white Banner

Thanks For Reading...