Virat Kohli : ఇందుకే క్రికెట్ ప్రపంచానికి కోహ్లీ కింగ్ అయ్యాడు..!

అయినప్పటికీ విజయం సాధించలేకపోవడంతో బెంగళూరు జట్టు అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. మ్యాచ్ ఓటమి అనంతరం కోహ్లీ పెట్టిన కన్నీళ్లను అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా షేర్ చేస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు.

  • Written By: BS Naidu
  • Published On:
Virat Kohli : ఇందుకే క్రికెట్ ప్రపంచానికి కోహ్లీ కింగ్ అయ్యాడు..!
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో కోహ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ అభిమానులకు ఆయన కింగ్ గా మారాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆటలో దూకుడుతోపాటు ప్రతి మ్యాచ్ లోను విజయం సాధించాలన్న కసి, పట్టుదల కోహ్లీలో ఎక్కువగా కనిపిస్తుంది. కోహ్లీ లోని ఈ తత్వమే కోట్లాది మంది అభిమానులు ఆయనను పూజించేలా చేస్తోంది. తాజాగా, గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీకి దగ్గర్లో కోహ్లీ చేసిన ఒక పని కోహ్లీ అభిమానులనే కాకుండా యావత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిభ కలిగిన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. అతి తక్కువ వయసులోనే అద్భుతమైన ఆట తీరుతో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు ఈ డాషింగ్ క్రికెటర్. తాజాగా ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న విరాట్ కోహ్లీ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఒక మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో సెంచరీ చేశాడు. ఈ సెంచరీ చేసే క్రమంలో 99 పరుగుల వద్ద కోహ్లీ చేసిన ఒక రిస్కీ రన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
జట్టు కోసం సెంచరీని పణంగా పెట్టిన కోహ్లీ..

సాధారణంగా అర్థ సెంచరీ, సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు బ్యాటర్లు ఆచితూచి ఆడుతుంటారు. ఎందుకంటే ఈ భవిష్యత్తులో గొప్ప మైలురాళ్లుగా నిలిచే అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పరుగు చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కోహ్లీ మాత్రం అటువంటి లెక్కలేవి వేసుకోడు. జట్టుకు ఉపయోగపడుతుంది అనుకుంటే సెంచరీని కూడా లెక్కచేయకుండా రిస్కీ రన్ చేస్తుంటాడు. అటువంటి రిస్కీ  రన్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చేశాడు విరాట్ కోహ్లీ. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఉన్నప్పుడు మిడిల్ స్టంప్ మీదుగా మోహిత్ శర్మ వేసిన బంతిని లాంగ్ ఆన్ మీదగా కోహ్లీ కొట్టాడు. అయితే అప్పటికే కోహ్లీ కొట్టిన బంతి ఫీల్డర్ వద్దకు వెళ్ళింది. అయితే కోహ్లీ మాత్రం వేగంగా పరుగు తీసే ప్రయత్నం చేసే క్రమంలో రన్ అవుట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు సెంచరీ కావాలి అనుకుంటే ఇక్కడ అంత రిస్కీ రన్ చేయాల్సిన అవసరం కోహ్లీకి లేదు. రెండు, మూడు బంతులు జిడ్డుకుని అయినా పరుగు చేసి సెంచరీ చేసే అవకాశం కోహ్లీకి ఉంది. అయితే, జట్టుకి కలిసి వచ్చే ఒక్క పరుగైనా విజయాన్ని అందిస్తుందన్న ఉద్దేశంతో కోహ్లీ ఆ రిస్కీ రన్ చేశాడని అభిమానులు పేర్కొంటున్నారు.

కోహ్లీ ఒంటరి పోరాటంతో భారీగా పరుగులు..
ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోహ్లీ అద్భుతమైన ఆట తీరుతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. కోహ్లీ సెంచరీతో అదరగొట్టడంతో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో 61 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఫాఫ్ డు ప్లెసిస్ 19 బంతుల్లో 28 పరుగులు చేయగా, బ్రాస్వల్ 16 బంతుల్లో 26 పరుగులు, అంజురావత్ 15 బంతుల్లో 23 పరుగులు చేయడంతో భారీ స్కోర్ సాధించింది బెంగళూరు జట్టు. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సుబ్ మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టడంతో విజయం దక్కించుకుంది. 52 బంతుల్లో 104 పరుగులు చేయగా, విజయ శంకర్ 35 బంతుల్లో 53 పరుగులు చేసి ఆ జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
కోహ్లీ పోరాటం వృథా..
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. భారీ లక్ష్యాన్ని విధించి ఎక్కువ పరుగులు తేడాతో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో తొలి బంతి నుంచే కోహ్లీ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. మంచి షాట్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 165.57 స్ట్రైక్ రేటుతో 13 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 61 బంతుల్లో 101 పరుగులు చేశాడు. టీమ్ చేసిన 197 పరుగుల్లో 101 పరుగులు కోహ్లీ మాత్రమే చేశాడంటే ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ విజయం సాధించలేకపోవడంతో బెంగళూరు జట్టు అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. మ్యాచ్ ఓటమి అనంతరం కోహ్లీ పెట్టిన కన్నీళ్లను అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా షేర్ చేస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు