OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / రాజకీయాలు / CM KCR Delhi Tour: వెన్నులో వణుకు.. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ అందేకేనా? ప్రధానిని కలువ కూడదనే ఆకస్మిక యాత్ర!!

CM KCR Delhi Tour: వెన్నులో వణుకు.. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ అందేకేనా? ప్రధానిని కలువ కూడదనే ఆకస్మిక యాత్ర!!

Published by Raghava Rao Gara On Saturday, 21 May 2022, 14:43

CM KCR Delhi Tour: తప్పు చేయని వాడు తల దించుకోడు.. తాను చేసిన పనిని ధైర్యంగా చెబుతాడు.. తలెత్తుకుని వాదిస్తాడు. తప్పు చేసిన వాడు ముఖం చాటేస్తాడు.. తల దించుకుని మాట్లాడుతాడు. కానీ తప్పు చేసి తల దించుకునేందుకు అహం అడ్డు వచ్చేవాడు.. ఎవరి విషయంలో తప్పు చేశాడో.. వారికి కనిపించకుండా తప్పించుకు తిరుగుతాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రస్తుతం ఇదే చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ ఆకస్మిక ఢిల్లీ టూర్‌తో తెలంగాణ బీజేపీకి సీఎం స్వయంగా ఒక విమర్శనాస్త్రాన్ని ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

CM KCR Delhi Tour

CM KCR

కేంద్రంతో చెడిన సఖ్యత..
దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల అభివృద్ధి విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ఎజెండా ఉంటుంది. కేంద్రంతో కొన్ని అంశాల్లో విభేధించినా రాష్ట్ర అవసరాల విషయంలో మాత్రం కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రధానిని, మంత్రులను కలుస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా ఆయన ప్రధాని నరేంద్రమోదీని కలువలేదు. కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కూడా కోరలేదు. కారణం కేవలం తెలంగాణలో బీజేపీ బలపడడమే. కేసీఆర్‌ అవినీతిని బీజేపీ నాయకులు ప్రశ్నించడమే. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించినంత పని చేయడమే. తాను ఏకఛత్రాదిపత్యం చేయాలని చూస్తున్న తెలంగాణలో తనకు దీటుగా మరొకరి ఎదుగుదలను ఓరవ్వలేని కేసీఆర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోలు అంశాన్ని ఎంచుకున్నారు. అది బెడిసి కొట్టడంతో విధిలేని పరిస్థితిలో యాసంగి ధాన్యం కొనేందుకు ముందుకు వచ్చారు. తాజాగా దేశ రాజకీయాల్లోకి వస్తా.. దేశాన్ని మార్చేస్తా అంటూ పర్యటించారు. కానీ ఎవరూ కలిసి రాలేదు. తాను కలిసిన ప్రతిపక్ష నేతలు కూడా కేసీఆర్‌ను బీజేపీ వ్యతిరేకిగా గుర్తించలేదు. దీంతో కేంద్రంతో చేసే పోరాటంలో కేసీఆర్‌ ఒంటరయ్యారు.

Also Read: Dissidence TRS Leaders: టీఆర్ఎస్ నేతల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల?

ప్రధానికి ముఖం చూపని కేసీఆర్‌..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు ఏడాదిన్నరగా ప్రధానికి ముఖం చూపలేదు. అధికారిక కార్యక్రమాలకు పీఎంవో కార్యాలయం నుంచి రాష్ట్రానికి ఆహ్వానం అందినా కేసీఆర్‌ హాజు కావడం లేదు.

– ఫిబ్రరిలో హైదరాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో నిర్వహించిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని హాజరయ్యారు. కేసీఆర్‌ రాష్ట్రంలోనే ఉండి తనకు జ్వరం వచ్చిందని ప్రధానిని కలువకుండా దూరంగా ఉన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఎయిర్‌పోర్టుకు పంపించారు.

– కరోనా ఫోర్త్‌ వేవ్‌పై ప్రధాని మూడు నెలల క్రితం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో సమీక్ష నిర్వహించారు. దీనికి కేసీఆర్‌ గైర్హాజరయ్యారు.

– సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ.రమణ ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. చీఫ్‌ జస్టిస్‌తో కేసీఆర్‌కు మంచి అనుబంధమే ఉన్నప్పటికీ కేవలం ప్రధాని అధ్యక్షతన జరుగుతుందన్న కారణంలో ఆ సమావేశానికి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను పంపించారు.

CM KCR Delhi Tour

CM KCR

– తాజాగా ఈనెల 26న ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఈమేరకు పీఎంవో ఆఫీస్‌ నుంచి ప్రధాని పర్యటన షెడ్యూట్‌ రాష్ట్ర పోలీసులకు అందింది. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్‌ రాష్ట్రంలో ఉంటే ప్రధాని పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. ప్రధానికి ఆహ్వనం పలికేందుకు ఎయిర్‌ పోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండకుండా పోవడమే మంచిదని భావించిన కేసీఆర్‌ ఆకస్మిక ఢిల్లీ టూర్‌ పెట్టుకున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ ప్రధాని పర్యటన నేపథ్యంలో పక్క రాష్ట్రాలకు పారిపోయారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read:Pawan Kalyan CM Candidate: పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్.. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందస్తు షరతు?

లైఫ్ స్టైల్

Alcohol: మద్యం తాగేటప్పుడు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే డేంజరే?

Lakshmana Plant for Wealth: ఇంట్లో ఈ మొక్క ఉంటే లక్ష్మీ తాండవమేనా?

India Corona: లక్షకు పైగా యాక్టివ్ కేసులు.. కరోనా దేశాన్ని కమ్మేస్తోందా?

TS Inter Marks Memos 2022: ఇంటర్ మార్కుల మెమో డౌన్ లోడ్ చేసుకోండిలా..

Ban Single-Use Plastic: సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ పై నిషేధం.. వాటికి ఇది సవాల్ ?

Married Women Google Search: కొత్తగా పెళ్లయిన మహిళలు గూగుల్ లో ఏం వెతుకుతున్నారు?

Condom Use: కండోమ్ ల వాడకంపై తెలంగాణ, ఏపీల్లో ఆసక్తికర సర్వే

July 1 Changes: జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివేనా?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Kerala Husband Kills Wife: బ్రష్ చేయకుండానే ముద్దు.. సీరియస్ అయిన భార్యను ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

Atrocities in Bihar: బిహార్ లో కూతురుపైనే అత్యాచారం చేస్తున్న తండ్రి.. చివరకు ఏం జరిగిందంటే?

Vishnu Priya Hot Dance : చిట్టి గౌనులో చంపేస్తోన్న విష్ణుప్రియ.. హాట్ డ్యాన్స్ వీడియో వైరల్

Pakka Commercial : గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ టాక్ ఎలా ఉందంటే?

Eknath Shinde Bio-graphy :ఒకప్పుడు ఆటో డ్రైవర్.. నేడు మహారాష్ట్ర సీఎం.. ఎవరు ఈ ఏక్ నాథ్ షిండే?

Manipur Landslide: ప్రపంచంలోని ఏ సైనికులకు లేనిది మనకే ఎందుకు?

మరిన్ని చదవండి ...

గాసిప్

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Viral: విడాకులకు సిద్ధమైన ముగ్గురు ప్రముఖ హీరోలు!?

BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు

TV9 Raviprakash: టీవీ9 అమ్మకం సక్రమమే.. రవిప్రకాష్ కు భారీ జరిమానా!

Anasuya Walks Out Of Jabardasth: సుధీర్, ఆది, ఇప్పుడు అనసూయ… బయటికి వస్తున్నారా? పంపుతున్నారా ?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap