OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / ప్రత్యేకం / Kailasa Temple Mystery: మిస్టరీ కైలాస పాతాళ గుడి.. ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే?

Kailasa Temple Mystery: మిస్టరీ కైలాస పాతాళ గుడి.. ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే?

Published by Naresh On Tuesday, 17 May 2022, 15:03

Kailasa Temple Mystery: భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు కేంద్రం. ఇప్పటికే ఎన్నో కట్టడాలు యావత్‌ ప్రపంచాన్ని అబ్బుర పరిచేలా చేశాయి. ఇంకొ కొన్ని నిర్మాణాలు కాలగర్భంగా కలిసిపోయాయి. కొన్ని నిర్మాణాలు భూగర్భంలో జరిగాయి. ఇలాంటి నిర్మాణాల్లో ఒకటి ఔరంగాబాద్‌లోని కైలాస గుడి. కైలాస గుడి అనగానే అందరికీ కాశీ క్షేత్రం గుర్తొస్తుంది. హిందువులకు అతి పవిత్రమైన శైవ క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా ప్రతీ హిందువు కాశీని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం. కాశీ క్షేత్రంతో సమానమైన ఎన్నో శివాలయాలు మన దేశంలో ఉన్నాయి. అందులో ఒకటి మహారాష్ట్రలోని కైలాస గుడి. ఈ ఆలయం పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. రహస్యంగానే ఉండిపోయింది.

Kailasa Temple Mystery

Kailasa Temple Mystery

1876, డిసెంబర్‌ 8లో 12 మంది పరిశోధకులతో కూడిన బృందం కైలాస గుడి ఉన్న గుహలోకి ప్రవేశించింది. అదే సంవత్సరం బ్రిటన్‌కు చెందిన ఓ రచయిత్రి కైలాస మందిరం కింద ఒక పెద్ద గుహ ఉందని, అందులో భిన్నంగా ప్రకాశ వంతంగా మనుషులు ఉన్నారని ఓ పుస్తకంలో రాశారు. దీనిని నిర్ధారించుకునేందుకు 12 మంది సభ్యుల బృందం గుహలోకి వెళ్లింది. వీరు 120 మీటర్లు లోపలికి వెళ్లగానే అక్కడ వాళ్లకి ఒక భయంకరమైన రూపం కనిపించింది. దానిని చూసి నిశ్చేష్టులయ్యారు. భారత ప్రభుత్వం కూడా ఆ తర్వాత ఆ గుహను మూసివేసింది. గతంలో లోనికి వెళ్లినవారెవనూ బయటకు రాలేదు. 12 మంది మాత్రం క్షేమంగా బయటకు వచ్చారు. వారు ఆలయం గురించి, గుహలో గమనించిన దృశ్యాల గురించి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.

Also Read: Kannada TV Actress Chethana Raj: అందం కోసం ప్రాకులాట, ప్రాణాలతో హీరోయిన్ల చెలగాటం !

-వందల ఏళ్ల క్రితమే నిర్మాణం..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో కొన్ని వందల ఏళ్ల క్రితమే ఈ ఆలయం నిర్మించారు. దీనిని ఎప్పుడు ఎవరు నిర్మించారనేది తెలియదు. రహస్యాన్ని ఛేదించేందుకు వెయ్యిమంది ఇప్పటికే పరిశోధనలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. కొంతమంది అంచనాల ప్రకారం.. ఈ దేవాలయం 1900 సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. మరికొంతమంది ఆరే వేల సంవత్సరాల పురాతనమైనదిగా పేర్కొంటారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత క్లిష్టమైనదిగా తెలిపారు. ప్రస్తుత ఎంత టెక్నాలజీ పెరిగినా అచ్చంగా ఈ మందిరంలా నిర్మించడం మాత్రం సాధ్యం కాదు. పెద్దపెద్ద రాళ్లను అద్భుతంగా చెక్కి దీనిని నిర్మించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన బుర్జు ఖలీఫా నిర్మించినప్పటికీ.. ఇలాంటి ఆలయం ఇప్పుడు నిర్మించడం మాత్రం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు , నిపుణులు చేతులెత్తేశారు.

-శిఖరం నుంచి నిర్మాణం..
పెద్ద రాయిని తొలచి అత్యంత అద్భుతంగా నిర్మించిన ఈ కైలాస ఆలయ నిర్మాణం శిఖరం నుంచి కిందకు చెక్కుతూ నిర్మించారంటే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా ఏ నిర్మాణం అయినా పునాది నుంచి మొదలు పెడతారు. కైలాస దేవాలయం మాత్రం శిఖరం నుంచి మొదలు పెట్టి నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 18 ఏళ్లలోనే ఇంత అద్భుతమైన ఆలయాన్ని చెక్కారంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఎంత గొప్ప ఇంజినీర్లు, ఎత్తయిన నిర్మాణాలు చేసే సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉన్నా.. ఇలాంటి ఆలయం నిర్మించడం మాత్రం అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చారు.

Kailasa Temple Mystery

Kailasa Temple Mystery

-గుప్త గుహలో నిర్మాణ రహస్యం..
ఆలయ నిర్మాణానికి సంబంధించిన రహస్యం ఆలయం కింద ఉన్న గుప్త గుహలో ఉన్నట్లు చెబుతారు. ఆలయం కింద పదుల సంఖ్యలో గుహలు ఉన్నాయి. అయితే వాటిని ప్రస్తుతం భారత ప్రభుత్వం మూసివేసింది. కానీ.. బ్రిటన్‌కు చెందిన ఓ రచయిత్రికి మందిరాలు, నిర్మాణాలపై పుస్తకాలు రాయడం ఆసక్తి. ఆమె కైలాస ఆలయం గురించి కూడా 1926 రాశారు. ఆలయాన్ని అణువణువూ తాను పరిశీలించానని పేర్కొన్నారు. తాను ఆలయంలోకి 100 మీటర్ల దూరం వెళ్లగానే బయటికి కనిపించే గుడికంటే అద్భుతమైన మరో గుడి లోపల ఉన్నట్లు తెలిపారు. గుహలో నివసించే ఏడుగురిని తాను చూసినట్లు పేర్కొన్నారు. వారి కళ్లు కూడా ప్రకాశవంతంగా ఉన్నట్లు, కొంతమంది అప్పుడప్పుడు మాయమవుతున్నట్లు వివరించింది. గుహలో ఒక ప్రకాశవంతమైన వస్తువును కూడా గమనించినట్లు రచయిత్రి తెలిపింది. దాని కాంతి నలువైపులా ప్రసరించడాన్ని గమనించానని పేర్కొంది. వస్తువు విశేషం తేల్చడానికే 12 మంది గుహలోకి వెళ్లారు. ఆలయ నిర్మాణం చరిత్రను కొంతవరకు ప్రపంచానికి తెలియజేశారు.

-రాణి నిర్మించినట్లు సమాచారం..
వందల ఏళ్ల క్రితం కైలాస ఆలయాన్ని ఒక రాణి నిర్మించినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన తన భర్తను కాపాడుకోవడానికి శివుడిని పూజించడంతోపాటు తన భర్త త్వరగా కోలుకుంటే ఆలయం నిర్మిస్తానని మొక్కుకుంది. ఆలయం నిర్మాణం శిఖరం చుసే వరకు ఉపవాసం కూడా చేస్తానని మొక్కుకుంది. అనుకున్నట్లుగానే రాజు త్వరగా కోలుకున్నాడు. దీంతో రాణి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే రాజు ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు తన భార్య ఉపవాసం చేయడం కష్టమని గ్రహించాడు. ఈ క్రమంలో రాజు శివున్ని పూజించి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు ప్రత్యక్షమై శివునికి ఆలయం శిఖర నిర్మాణం పూర్తయ్యే వరకు తన భార్య ఉపవాసం చేయడం సాధ్య కాదని, ఉపాయం చెప్పాలని వేడుకున్నాడట. ఈ సమయంలో శివుడు ఆలయ నిర్మాణం త్వరగా చేయడానికి ఒక అస్త్రాన్ని రాజుకు ఇచ్చాడట. అంతేకాకుండా నిర్మాణాన్ని పునాది నుంచి కాకుండా శిఖరం నుంచి ప్రారంభించాలని చెప్పాడట.

Kailasa Temple Mystery

Kailasa Temple Mystery

అలా అయితే రాణి మొదట శిఖరం చూసి ఉపవాస దీక్ష విరమిస్తుందని తెలిపాడట. శివుడు చెప్పినట్లే రాజు అస్త్రం సాయంతో ఆలయాన్ని శిఖరం నుంచి నిర్మించడం మొదలు పెట్టాడట. దీంతో రాణి ఉపవాస దీక్ష విరమించిందట. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రాజు శివుడు ఇచ్చిన విలువైన అస్త్రాన్ని ఆలయం కింద గుహలో దాచినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ రచయిత చూసిన వస్తువు అదే అయి ఉంటుందని భావిస్తున్నారు. 12 మంది బృందం కూడా దీనినే చూసి ఉంటుందని సమాచారం. అయితే దీనిని చూసినవారెవరూ ఎక్కువ కాలం బతకలేదట. రేడియో యాక్టివ్‌ కిరణాల కారణంగానే చనిపోయి ఉంటారని సమాచారం. రచయిత్రకు కనబడిన ప్రకాశవంతమైన వ్యక్తులు కూడా ఆ అస్త్రానికి రక్షణగా ఉండి ఉంటారని భావిస్తున్నారు.

Kailasa Temple Mystery

Kailasa Temple Mystery

మొత్తానికి ఇప్పటికీ కైలాస గుడిని ఎలా నిర్మించారన్నది ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేదు. దీన్ని నిజంగా రాణియే నిర్మించిందా? లేక ఏలియన్స్ వచ్చి కట్టారా? అన్న అనుమానాలు ఆ అద్భుత శిల్ప సౌందర్యం చూస్తే కలుగకమానదు. ఎన్నో తెలుసుకున్న శాస్త్రవేత్తలకు ఈ కైలాసగుడి మిస్టరీని మాత్రం ఇప్పటికీ చేధించకపోవడం విశేషమే మరీ.

Also Read:Jagan- Early Elections: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా?

లైఫ్ స్టైల్

Team India Ready For first T20 Against England: ఇంగ్లండ్ తో తొలి టీ20 పోరుకు టీమిండియా సిద్ధం.. ఇరు జట్ల బలాబలాలివీ!

Rainy Season: వర్షాకాలంలో ఆ నాలుగు కూరగాయలు తినకూడదా?

TVS Ronin 2022: గంటకు 120 కి.మీ.ల వేగం..అడ్వాన్స్ ఫీచర్స్: మార్కెట్లోకి TVS రోనిన్..

MS Dhoni Love Story: ధోని-సాక్షి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా?

Electric Vehicles: ‘ఈ’-బండి జోరు పెరుగుతోంది

Virat Kohli: విరాట్ కోహ్లిపై వేటు వేసేందుకే ఈ షాకింగ్ నిర్ణయమా?

India vs England 5th Test: ఇంగ్లండ్ పై టీం ఇండియా ఓటమికి కారణాలు ఇవే

Drinking Hot Water: వేడి నీరు తాగడం వల్ల ఏ ప్రయోజనాలున్నాయో తెలుసా?

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Gorantla Rajendraprasad Away: చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Alia Bhatt: ఫస్ట్ నైట్ పై ఓపెన్ గా చెప్పేసిన ఆలియా భట్.. వైరల్

A period of decay: కుళ్ళిపోవడానికి ఎవరికి  ఎంత సమయం పడుతుంది?

Acharya Koratala Shiva: ‘ఆచార్య’తో నష్టపోయిన వారికి ఆస్తులమ్మి చెల్లిస్తున్న కొరటాల శివ!?

Telugu Heroines Caste: మన టాప్ 21 తెలుగు హీరోయిన్ల కులాలేంటో తెలుసా.?

మరిన్ని చదవండి ...

గాసిప్

Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Acharya Koratala Shiva: ‘ఆచార్య’తో నష్టపోయిన వారికి ఆస్తులమ్మి చెల్లిస్తున్న కొరటాల శివ!?

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Viral: విడాకులకు సిద్ధమైన ముగ్గురు ప్రముఖ హీరోలు!?

BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap