Site icon OkTelugu

Lok Sabha Elections 2024: మల్కాజిగిరి రివ్యూ : ఈటలకు ఎడ్జ్.. కాంగ్రెస్ స్వయంకృతాపరాధం!

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: తెలంగాణలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి. మినీ ఇండియాగా గుర్తింపు ఉన్న మల్కాజ్‌గిరిలో గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానమైన మల్కాజ్‌గిరిలో ఈసారి ఆ పార్టీ స్వయంకృతాపరాధమే ఆ పార్టీ గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్‌కు సిట్టింగ్‌.. బీజేపీకి అడ్వాంటేజ్‌..
మల్కాజ్‌గిరిలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఆ పార్టీ సిట్టింగ్‌ స్థానం 2024 ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారిందని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు.

రాంగ్‌ క్యాండిడేట్‌..
కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల అభ్యర్థిగా ఎంపిక చేస్తామని పట్నం మహేందర్‌రెడ్డి భార్య పట్నం సునీతను చేర్చుకున్నారు. కానీ, చివరి నిమిషంలో వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఆమెను మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కూడా స్థానికేతరుడే. కానీ పార్టీ నేతల నుంచి ఆయనకు సంపూర్ణ సహకారం అందుతోంది. బీసీ సామాజికవర్గం మద్దతు కూడా ఆయనకే ఉందని ప్రచారం జరుగుతోంది. పట్నం సునీతకు సొంత పార్టీనేతల నుంచి సహాయం అందడం లేదు. దీంతో నియోజకవర్గంలో ఆమె ప్రభావం చూపలేకపోతున్నారు.

ఎవరు గెలిచిన స్వల్ప మెజారిటీతోనే..
ఇక మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌ పోటీ నామమాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తోంది. హోరాహోరీ పోరులు ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలుస్తారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థి సునీతతోపాటు స్థానిక నేతలు ఇప్పుడు రేవంత్‌ చరిష్మాపైనే నమ్మకంతో ఉన్నారు.

Exit mobile version