Site icon OkTelugu

కేసీఆర్‌ మనువడి కాలికి తీవ్ర గాయాలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనువడు, కేటీఆర్‌ కుమారుడు హీమాన్షుకు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తూ కిందపడి కాలికి గాయాలైనట్లు సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు హిమాన్షుకు సిటీస్కాన్‌ చేశారు. తుంటి, మోకాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు వైద్యులు గుర్తించారు. కేటీఆర్‌ దంపతులు హిమాన్షుతోనే ఆసుపత్రిలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ మనువడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఎప్పటికప్పడు తెలుసుకుంటున్నారు.

Exit mobile version