2020-21 సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భంపర్ ఆఫర్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.15 వేల వరకు, మిగిలిన పట్టణాల్లో రూ.10 వేల వరకు ఇంటి పన్ను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లంచి వారికి వచ్చే ఏడాది చెల్లించే మొత్తంలో మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 31.40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. నిజనమైన వరద బాధితులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీపావళి కానుకగా కేటీఆర్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.