హైదరాబాద్లో ఇటీవల జరిగిన హైమంత్ హత్య పరువు హత్యేనని గచ్చిబౌలి పోలీసులు సోమవారం వెల్లడించారు. తన కూతురు కూలాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్తో కలిసి హత్య చేయించినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్రెడ్డి పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నారు. హైంత్ ప్రేమ వివాహం గురించి తెలిసిన లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించారన్నారు. హత్యకేసులో మొత్తం 25 మందిని గుర్తించినట్లు తెలిపారు.