
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,602 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,47,284 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,366గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,26,646 మంది కోలుకోగా ప్రస్తుతం 19,272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 16,522 మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిరిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 295 కేసులు నమోదయ్యాయి. కాగా గత రోజులుకు పోల్చుకుంటే కేసుల సంఖ్య పెరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.