
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 582కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,31,834 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,432గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,11,912 మంది కోలుకోగా ప్రస్తుతం 18,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 15,581 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.