
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,436 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఆరుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,22,111, గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,271గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 1,94,653 మంది కోలుకోగా ప్రస్తుతం 22,050 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 18,279 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. జీహెచెంసీ పరిధిలో 249 కేసులతో మొదటిస్థానంలో ఉంది.