
chandrababu- ganta srinivasa rao
AP MLC Elections: ఏపీలో పట్టభద్రుడు కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసిపికి అనూహ్య షాక్ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మూడు స్థానాల్లో రెండింటిని కైవసం చేసుకున్న టిడిపి మరో స్థానంలోనూ వైసీపీకి గట్టి పోటీ ఇస్తోంది. ఇందులో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానంలో టిడిపి భారీ గెలుపు అందుకున్న రాజధాని అవడం ద్వారా ఉత్తరాంధ్ర పై పట్టు సంపాదించాలన్న వైసీపీ ఆశలకు గండి కొట్టింది. దీని వెనుక ఏపీ రాజకీయాల్ని భారీ మలుపు తిప్పగల చాలా కీలక పరిణామాలు కనిపిస్తున్నాయి.
టిడిపి అభ్యర్థి గెలుపు..
ఉత్తరాంధ్రలో జరిగిన పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నిలబెట్టిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఘనవిజయం సాధించారు. అధికార వైసిపి నిలబెట్టిన సీతంరాజు సుధాకర్ ను దాదాపు 15% ఓట్ల తేడాతో చిరంజీవి రావు మట్టి కల్పించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపు పై ఏమాత్రం ఆశలు లేని పరిస్థితుల్లో అభ్యర్థులే దొరకన టిడిపి చివరికి ఘనవిజయంతో ఎన్నికైన ముగించడం ఇప్పుడు అధికార వైసిపికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని విధాల అండగా నిలిచిన వైసిపి ఓటమిపాలవడం వెనుక టిడిపి రచించిన భారీ వ్యూహాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కీలకంగా మారిన మాస్టరు అభ్యర్థిత్వం..
ఉత్తరాంధ్రలో బీసీ జనాభా చాలా ఎక్కువ. అలాగే గత ఎన్నికల్లో బీసీలు టిడిపిని వీడి వైసిపికి మద్దతు ఇచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గమైన నాగవంశీయులకు చెందిన గాడు చిన్ని లక్ష్మి కుమారిని టిడిపి తొలుత అభ్యర్థిగా నిలబెట్టింది. గెలుపు పై ఏమాత్రం ఆశలు లేని పరిస్థితుల్లో అభ్యర్థి దొరకని టిడిపి చివరికి లక్ష్మి కుమారిని ఎంచుకుంది. దీంతో లక్ష్మి కుమారి సొంత బలం పైన గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె గెలుపు పై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. చివరి నిమిషంలో ఆమెను తప్పించి కాపు సామాజిక వర్గానికి చెందిన వేపాడ చిరంజీవి రావు కు టిడిపి టికెట్ను ఇచ్చింది. ఇదే చివరికి టిడిపిని గెలుపు దిశగా నడిపించింది.

AP MLC Elections
టిడిపికి అండగా నిలిచిన కాపులు..
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టిన వైసిపి ఆయన గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డింది. ఇదే క్రమంలో కాపులతో ఓ సమావేశం కూడా పెట్టించింది. కీలకంగా ఉన్న కాపు నేతలను ఆహ్వానించలేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు మరికొందరు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలను మాత్రమే దీనికి ఆహ్వానించారు. ఇది కాపు సామాజిక వర్గంలో మంట పుట్టించింది. అదే సమయంలో టిడిపి కూడా ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు కాపు అభ్యర్థి చిరంజీవి రావును బరిలో దింపింది. దీంతో వైసిపి నిలబెట్టిన బ్రాహ్మణ అభ్యర్థిని కాదని టిడిపి నిలబెట్టిన కాపు అభ్యర్థికి అండగా నిలవాలని కాపులు నిర్ణయించుకున్నారు. తుదికంట అండగా నిలిచి తమ సామాజిక వర్గ అభ్యర్థిని కాపులు గెలిపించుకున్నారు.
ఫలితం ఇచ్చిన గంటా వ్యూహం..
ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన టిడిపికి దూరంగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఎన్నికలతో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించడం ద్వారా విశాఖలో తన చెత్తా చాటాలనుకున్న గంట అంతా తానే ఎన్నికలను నడిపించారు. టిడిపి అభ్యర్థి మార్పుతో పాటు స్థానిక నేతలతో వరుసగా సంప్రదింపులు జరిపి వేపాడ చిరంజీవి గంటా బాటలు వేశారు. చివరికి చిరంజీవి రావు గెలుపుతో గంటా సత్తా చాటుకున్నారు. ఇప్పుడు గంటను నమ్ముకుని విశాఖలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు టిడిపి వ్యూహరచన చేసే స్థాయికి ఆయన చేరిపోయారు. గంట రీఎంట్రీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో టిడిపి అవకాశాలను మరింత మెరుగుపరిచిందనే వాదన వినిపిస్తోంది.

AP MLC Elections
కలిసి వచ్చిన అభ్యర్థి బలం..
చిరంజీవిరావును బరిలో దించడం వెనుక తెలుగుదేశం పార్టీ అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను గాలం వేయడంతో పాటు.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉన్న ఆయన శిష్యుల ఓట్లను గంపగుత్తగా పొందేందుకు అవకాశం ఉందన్న లెక్కలను తెలుగుదేశం పార్టీ వేసుకుంది. తెలుగుదేశం పార్టీ ఊహించినట్టుగానే ఈ లెక్కలు పనికి వచ్చాయి. పాలిటిక్స్ బరిలో దిగిన ఎకనామిక్స్ మాస్టారు మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉత్సాహంలో ముంచెత్తారు.