మాజీ మంత్రి పురందేశ్వరి సైతం హాజరవుతుండడంతో పొలిటికల్ గా ఓ సీన్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు కార్యక్రమాన్ని వాడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు మించి శక పరుషుడి శత జయంతి వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి.
సరిగ్గా ఎన్నికల వేళ చంద్రబాబు అదును చూసి కొట్టినట్టయ్యింది. అందర్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఎన్టీఆర్ మైలేజీని.. తద్వారా టీడీపీకి పొలిటికల్ గా గెయిన్ చేయనున్నారన్న మాట.
దాదాపు నందమూరి కుటుంబంలో వంద మంది వరకూ సభ్యులు ఉండగా.. కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అటు కుమారులు, ఇటు కుమార్తెలు, వారి వారసులు ఉన్నారు.