కెన్యాలో ఒక చర్చి పెద్ద నిర్వాకం కారణంగా ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారు. గత నెల నుంచి అధికారులు కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం ఏకంగా 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు అధికారులు నిర్ధారించారు.