Kumari Aunty: హైదరాబాద్ మహానరంగంలో కేబుల్ బ్రిడ్జి పక్కన ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం గడుపుతున్న కుమారీ ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వంటలతో ఫేమస్ అయినా ఈ ఆంటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించింది. ఇక ఈమెను యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూ చేయడంతో మరింత పాపులర్ అయింది. ఇలా సోషల్ మీడియా ద్వారా కుమారీ ఆంటీ పాపులర్ అవడంతో ఆమె బిజినెస్ కూడా మరింత పెరిగిపోయింది. ఇలా ఈమె చేతివంట రుచి చూడడం కోసం పక్క రాష్ట్రాల నుంచి వస్తుంటారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఈమె ఫుడ్ టెస్ట్ చేయడం కోసం వస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈమె పాపులర్ అవడంతో బిజినెస్ కూడా మరింత పెరిగిపోయింది. అయితే పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు రావడంతో ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో పోలీసులు ఆమె బిజినెస్ ను క్లోజ్ చేయించారు. అనంతరం ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆమెను ఫుడ్ బిజినెస్ ను రన్ చేసేలా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలు ఈమెను కలిసి తనతో మాట్లాడడమే కాకుండా పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ సందడి చేశారు.
ఇక ఈ కుమారీ యాంటీ బుల్లితెర కార్యక్రమంలో సందడి చేయబోతోంది అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వాటిని ఖండించింది కుమారీ ఆంటీ. ఇకపోతే తాజాగా ఈమె స్టార్ మాలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ ఉత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ సీజన్ సెవన్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని టాక్. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతోందట.
ఇక ఈ వీడియో వైరల్ అవడంతో పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏదో చిన్న బిజినెస్ స్టాట్ చేసిన కుమారీ ఆంటీ రేంజ్ పెరగడం చాలా సంతోషం. అంతేకాదు కొందరు మాత్రం ఈ బిగ్ బాస్, ఇతర షోల వల్ల మీ ఫుడ్ బిజినెస్ ను పాడు చేసుకోవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే ఉత్సవం కార్యక్రమంలో పాల్గొనడమే కాదు.. బిగ్ బాస్ లో పాల్గొన్న ఆశ్చర్యం లేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More