Homeక్రీడలుక్రికెట్‌Sankranti Special Trains: సంక్రాంతికి ఊరెళ్లాలనుకుంటున్నారా.. టికెట్‌ దొరకలేదా.. అయితే ఈ శుభవార్త మీకోసమే..!

Sankranti Special Trains: సంక్రాంతికి ఊరెళ్లాలనుకుంటున్నారా.. టికెట్‌ దొరకలేదా.. అయితే ఈ శుభవార్త మీకోసమే..!

Sankranti Special Trains: సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్‌. తెలంగాణలో దసరా తరహాలో ఆంధ్రులకు సంక్రాంతి అతిపెద్ద పండగ. దేశంలో ఎక్కడ ఉన్నా.. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్తారు. మరో పది రోజుల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. అయితే ఇప్పటికే అన్ని రైళ్లలో టికెట్లు బుక్‌ అయ్యాయి. చాలా మంది టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో శుభావర్త తెలిపింది. మరో 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతామని పేర్కొంది. ఆయా ప్రాంంతాలకు జనవరి 6 నుంచి 18వ తేదీ మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్లు నడవనున్నాయి.

ప్రత్యేక రైళ్లు ఇవే..
సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాస్ట్రాల ప్రయాణికుల కోసమే 52 కొత్త రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది. జనవరి 6వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు (07077, 02764), 6చ, 8, 11, 15వ తేదీల్లో, తిరుపతి–చర్పల్లి మధ్య ప్రత్యేక రైళ్లు(07078, 02763) 7, 9, 12, 16వ తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ఈనెల 13న వికారాబాద్‌–కాకినాడ, 14న కాకినాడ–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కాచిగూడ–తిరుపతి రైళ్లు(07655) రైళ్లు 9, 16 తేదీల్లో, తిరుపతి–కాచిగూడ రైళ్లు(07656) రైళ్లు 10, 17వ తేదీల్లో నడుస్తాయి.

ఈ రైళ్లు కూడా…
చర్లపల్లి–నర్సాపూర్‌ రైళ్లు 11, 18 తేదీల్లో, నర్సాపూర్‌–చర్లపల్లి రైళ్లు 12, 19 తేదీల్లో, సికింద్రాబాద్‌–కాకినాడ రైళ్లు 12, 19 తేదీల్లో, కానినాడ–సికింద్రాబాద్‌ రైళ్లు 12, 19 తేదీల్లో, చర్లపల్లి–నర్సాపూర్‌ రైళ్లు 7, 9, 13, 15, 17 తేదీల్లో, నర్సాపూర్‌–చర్లపల్లి రైళ్లు 8, 10, 14, 16, 18 తేదీల్లో నడవనున్నాయి. చర్లపల్లి–కాకనినాడ రైళ్లు 8, 10, 12, 14 తేదీల్లో, కాకినాడ–చర్లపల్లి రైళ్లు 9, 11, 13, 15 తేదీల్లో, నాందేడ్‌–కాకినాడ రైళ్లు 6, 13 తేదీల్లో కాకినాడ–నాందేడ్‌ రైళ్లు 7, 14 తేదీల్లో నడుస్తాయి. చర్లపల్లి–శ్రీకాకుళం రోడు(ఆముదాలవలస) 9, 12, 14 తేదీల్లో, శ్రీకాకుళం రోడ్‌–చర్లపల్లి రైళ్లు 10, 13, 15 తేదీల్లో నడుస్తాయి. ఈనెల 7న కాచిగూడ–శ్రీకాకుళం రోడ్, 8న శ్రీకాకుళం రోడ్‌–చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

122 ప్రత్యేక రైళ్లు..
సంక్రాంతికి ఈ ఏడాది దక్షిణ మధ్య రైల్వే 122 రైళ్లు సిద్ధం చేసింది. వాటికి అదనంగా మరో 60 రైళ్లు కూడా నడుపుతున్నారు. వీటితోపాటు 90 పాసింగ్‌ త్రూ రైళ్లను పట్టాలెక్కిస్తుంది. ఈ సంక్రాంతికి రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో 160నుంచి 170 రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అవసరాన్నిబట్టి రైళ్లు పెంచుతామని పేర్కొంటున్నారు. ఈ రోజు నుంచి అదనపు రైళ్ల బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular