Sanju Samson: టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో విపరీతమైన పోటీ ఉంది. ఒక ఆటగాడికి అవకాశం లభించడమే అత్యంత కష్టంగా ఉంటే.. వచ్చిన అవకాశాన్ని నిలుపుకోకపోతే అంతే సంగతులు. ఒకసారి బయటికి వెళ్లిపోతే.. మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకోవడం అంత సులభం కాదు. మేనేజ్మెంట్ టి20 ఫార్మేట్ లో ఆటగాళ్లకు చోటు ఇవ్వడంలో ముఖ్యంగా ఐపీఎల్ లో చూపించిన ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుంటున్నది. అలాంటప్పుడు ఆటగాళ్లు చోటు సంపాదించడమే కాదు.. దక్కించుకున్న చోటు కోసం స్థిరమైన ఆట తీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
టీమ్ ఇండియాలో ప్రస్తుతం ఓపెనర్ సంజు శాంసన్ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాడు. ఐర్లాండ్ సిరీస్ లో వరుసగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి t20 మ్యాచ్లో కూడా బ్యాట్ ఎత్తేశాడు. వాస్తవానికి టి20 వరల్డ్ కప్ లో అతడు చూపించిన ప్రదర్శన ఆధారంగా జట్టులో చోటు లభించింది. కానీ ఇప్పుడు.. అతడి విఫల ప్రదర్శన చోటుకే ఎసరు తీసుకొచ్చే విధంగా ఉంది. ఇప్పటికే మేనేజ్మెంట్ అతడికి మూడు అవకాశాలు ఇచ్చింది. ఇంకా మరికొన్ని అవకాశాలు ఇస్తుందో లేదో తెలియదు గాని.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే రెండవ టి20 మ్యాచ్లో సంజు తనను తాను నిరూపించుకో లేకపోతే స్థానాన్ని వైభవ్ సూర్య వంశీ త్యాగం చేయాల్సి ఉంటుంది.
ఐర్లాండ్ జట్టు మీద కేవలం 5, 0 పరుగులు మాత్రమే చేశాడు సంజు. ఇంగ్లాండ్ జట్టు మీద తొలి మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగాడు. ఆడితేనేమో గొప్పగా ఆడుతున్నాడు. లేకుంటేనేమో విఫలమవుతున్నాడు. పైగా ఓపెనర్ గా రంగంలోకి దిగుతున్న అతడు.. త్వరగా విఫలమయి వెంటనే వెనక్కి వస్తున్నాడు.. అతడు అలా అవుట్ కావడం మిగతా ప్లేయర్లను తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తుంది.. సంజు మీద విమర్శలు వస్తున్నప్పటికీ కోచ్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్ అయ్యర్ అతడికి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈ సపోర్ట్ ఎంత కాలమో సాగదు. వరుసగా అతడు విఫలమైతే.. మేనేజ్మెంట్ కూడా అవకాశాలు ఇవ్వదు. టి20 వరల్డ్ కప్ హీరో అని పొగిడిన వారే.. జీరో అంటూ తిరస్కరిస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు.
సంజు విఫలమవుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో సూర్య వంశీకి అవకాశం కల్పించాలని డిమాండ్ల వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో సూర్య వంశీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా కు ట్రోఫీ ని అందించాడు. అంతేకాదు ఐర్లాండ్ జట్టుతో జరిగిన సిరీస్ కు ఎంపిక అయ్యాడు. కానీ సీనియర్ ప్లేయర్లు ఉండడంతో అతనికి ఆడే అవకాశం లభించలేదు. ఇప్పుడు సంజు విఫలమవుతున్న నేపథ్యంలో అతడికి చోటు కల్పించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మేనేజ్మెంట్ సంజుకు ఒకటి లేదా రెండు అవకాశాలు ఇచ్చి.. అందులో కూడా అతడు సఫలం కాకపోతే.. అతడి స్థానాన్ని సూర్య వంశీతో భర్తీ చేసే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికే ఆకలిగా ఉన్న పులి మాదిరిగా ఎదురుచూస్తున్నాడు సూర్య వంశీ. వచ్చిన అవకాశాన్ని అతడు ఏమాత్రం వదులుకోడు. ఎందుకంటే శ్రీలంక ప్లేయర్లు ఫైనల్ మ్యాచ్ ముందు తనను గెలికితే.. ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో అందరికీ తెలుసు. తనకు ప్లేయింగ్ 11 లో అవకాశం ఇవ్వకపోతే.. సూర్యవంశీ లో ఎంతటి కసి దాగి ఉందో అందరికీ తెలుసు. అవకాశం ఇచ్చి చూపిస్తే మాత్రం టి20 క్రికెట్ మొత్తాన్ని తగలబెట్టే దమ్ము సూర్య వంశీకి ఉంది. అందువల్ల సంజు జాగ్రత్త పడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి.

