Riyan Parag Shoulder Surgery: టీమిండియాలో యంగ్ ఆటగాడిగా.. ఐపీఎల్ లో రాజస్థాన్ సారధిగా రియాన్ పరాగ్ అందరికీ సుపరిచితుడే. దూకుడు అయిన ఆట తీరుకు ఇతడు పెట్టింది పేరు. మైదానంలో సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా నేర్పరి. అందువల్లే అతడిని రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ సీజన్ లో సారధిగా నియమించింది. ఇతడి నాయకత్వంలో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ దాకా వెళ్ళినప్పటికీ.. కీలక దశలో గుజరాత్ చేతిలో ఓడిపోయింది.
ఇటీవల ప్రకటించిన టి20 జట్టులో పరాగ్ చోటు దక్కించుకోలేదు. అతడు ఆసుపత్రిలో బెడ్ మీద కనిపించాడు. పైగా అతడి చేతికి సెలైన్ బాటిళ్లు ఎక్కుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. దీంతో అతడికి ఏం జరిగిందని చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. అయితే అతడికి అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స జరిగిందని కొంతమంది అంటున్నారు. చివరికి తాను ఆసుపత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఎందుకు బెడ్ మీద పడుకోవాల్సి వచ్చింది అనే విషయాలపై పరాగ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
పరాగ్ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల ఈ ఐపీఎల్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసే అతడు.. త్వరగానే అవుట్ అయి వచ్చాడు. గత రెండు సంవత్సరాలుగా అతడు ఈ భుజం నొప్పితో బాధపడుతున్నాడు చికిత్స చేయించుకుంటున్నప్పటికీ ఉపయోగపడటం లేదు.. అందువల్లే వైద్యుల సలహా మేరకు ఈసారి ఏకంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అతడు మునుపటి మాదిరిగా చెలరేగిపోతాడు.
ఈ భుజం నొప్పి నేపథ్యంలో తాను తీవ్రంగా ఇబ్బంది పడినట్టు పరాగ్ వ్యాఖ్యానించాడు. కొన్నిసార్లు భుజం సహకరించేది కాదని.. బ్యాటింగ్ చేయడం సాధ్యమయ్యేది కాదని.. తీవ్రమైన ఒత్తిడి అనుభవించాల్సి వచ్చిందని అతడు వాపోయాడు. చివరికి ఇప్పుడు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత భుజం నొప్పి మొత్తం మాయమైపోయిందని.. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మైదానంలోకి అడుగు పెడతానని అతడు స్పష్టం చేశాడు. అతడు భుజం నొప్పి నుంచి త్వరగా కోలుకోవాలని.. టీమిండియా కు.. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాలని అభిమానులు కోరుతున్నారు.

