Ind vs Pak: పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ కుమార్తెతో భారత జట్టు సెల్ఫీలు.. వైరల్

Ind vs Pak: ఇండియా-పాకిస్తాన్ అంటేనే ఒక యుద్ధంలాగానే ఆట నడుస్తుంది. ప్రపంచ వేదికలపై ఈ రెండు టీంలు ఎప్పుడు తలపడినా ఒక యుద్ధం చేస్తున్నట్టే ఆటగాళ్లు పోరాడుతుంటారు. తాజాగా ఐసీసీ మహిళా ప్రపంచకప్ లో భాగంగా నేడు ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ మహిళా టీంను ఓడించింది. ఆ ట్రాక్ రికార్డును కంటిన్యూ చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా క్రికెటర్లు షేర్ చేసిన వీడియో […]

Written By: NARESH, Updated On : March 6, 2022 9:52 pm
Follow us on

Ind vs Pak: ఇండియా-పాకిస్తాన్ అంటేనే ఒక యుద్ధంలాగానే ఆట నడుస్తుంది. ప్రపంచ వేదికలపై ఈ రెండు టీంలు ఎప్పుడు తలపడినా ఒక యుద్ధం చేస్తున్నట్టే ఆటగాళ్లు పోరాడుతుంటారు. తాజాగా ఐసీసీ మహిళా ప్రపంచకప్ లో భాగంగా నేడు ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ మహిళా టీంను ఓడించింది. ఆ ట్రాక్ రికార్డును కంటిన్యూ చేసింది.

మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా క్రికెటర్లు షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. పాకిస్తాన్ మహిళా క్రికెటర్ జట్టు కెప్టెన్ బిస్మా మరూఫ్ తనన నెలల కుమార్తెతో పెవిలియన్ లో తిరగాడింది. అంత చిన్న పాపతో ప్రపంచకప్ ఆడుతున్న కెప్టెన్ ను చూసి భారత క్రికెటర్లు మురిసిపోయారు.ఆమె కుమార్తెను ముద్దు చేశారు. ఈ వీడియోను భారత క్రికెటర్లు షేర్ చేశారు. పాక్ జర్నలిస్టు సైతం ఈ ఫొటోను, వీడియోను షేర్ చేసింది.

మరూఫ్ కుమార్తెతో భారత క్రికెటర్లు సెల్ఫీలు తీసుకున్నారు. ఆపై చిన్నారితో ఆడుకుంటూ కనిపించారు. మైదానంలో ఇరు జట్లు భీకరంగా తలపడినా బయట మాత్రం ఇంత స్నేహంగా ఉంటూ స్ఫూర్తి చాటారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

భారత, పాకిస్తాన్ క్రికెటర్ల ఆప్యాయత, అనురాగాలు చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. శత్రుదేశాలు అయినా క్రీడాకారులు చూపిస్తున్న వైఖరికి ఫిదా అవుతున్నారు.