ప్రముఖ దిగ్గజ క్రికెటర్ కు కరోనా

మహారాష్ట్రలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఇంటిలోంచి కాలు బయటకు పెడితే చాలు కరోనా వ్యాపిస్తోంది. పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి. తాజాగా ముంబైలో ఉంటున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం కరోనా బారినపడడం కలకలం రేపింది. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయాన్ని సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని.. ఈ రోజు పాజిటివ్ గా తేలిందని వెల్లడించాడు. అయితే తన ఇంట్లో […]

Written By: NARESH, Updated On : March 27, 2021 12:48 pm
Follow us on

మహారాష్ట్రలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఇంటిలోంచి కాలు బయటకు పెడితే చాలు కరోనా వ్యాపిస్తోంది. పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి. తాజాగా ముంబైలో ఉంటున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం కరోనా బారినపడడం కలకలం రేపింది. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయాన్ని సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని.. ఈ రోజు పాజిటివ్ గా తేలిందని వెల్లడించాడు. అయితే తన ఇంట్లో అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపాడు.

వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నట్లు సచిన్ తెలిపారు. తనకు చికిత్స అందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవలే సచిన్ టెండూల్కర్ ప్రపంచ రోడ్ సేఫ్టీ సిరీస్ లో పాల్గొన్నాడు. భారత లెజెండ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. ఫైనల్ లో శ్రీలంకను చిత్తు చేసి సచిన్ టీం ట్రోఫీ అందుకుంది. ఆ సిరీస్ లోనే కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఆ సిరీస్ ముగిసిన వారంలోనే సచిన్ కు కరోనా సోకడం గమనార్హం.