Trigrahi Yoga. : త్వరలో త్రిగ్రాహి యోగం.. ఈ మూడు రాశుల వారికి అన్నీ శుభాలే..

గ్రహాలు వాటి స్థానం చలనం చేసే క్రమంలో మరో గ్రహంతో సమాన కక్షలో ఉంటుంది. ఇలా ఒకేసారి మూడు గ్రహలు ఒక్కోసారి కలుస్తూ ఉంటాయి. దీనినే త్రిగ్రహియోగం అంటారు. ఈ ఆగస్టులో వచ్చే శుక్రవారం నుంచి సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలయిక ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి వద్దన్నా ధనం వచ్చి చేరుతుంది.

Written By: Srinivas, Updated On : August 12, 2024 11:51 am

Trigrahi Yoga

Follow us on

Trigrahi Yoga. : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల మార్పులతో రాశులపై ప్రభావం పడుతుంది. దీంతో ఆ రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు వస్తాయి. కొన్ని గ్రహాలు వాటి స్థానం చలనం చేసే క్రమంలో మరో గ్రహంతో సమాన కక్షలో ఉంటుంది. ఇలా ఒకేసారి మూడు గ్రహలు ఒక్కోసారి కలుస్తూ ఉంటాయి. దీనినే త్రిగ్రహియోగం అంటారు. ఈ ఆగస్టులో వచ్చే శుక్రవారం నుంచి సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలయిక ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి వద్దన్నా ధనం వచ్చి చేరుతుంది. చేపట్టిన ప్రతీ పని విజయం అవుతుంది. ఇంతకాలం కష్టాల్లో కూరుకుపోయిన వారు ఐశ్వర్యవంతులవుతారు. మరి ఆ అదృష్టవంతులు ఎవరో చూద్దాం..

త్రిగ్రాహి కారణంగా ధనస్సు రాశిపై ప్రభావం పడనుంది. ఈ మూడు గ్రహాల కలయికతో ఈ రాశి వారికి అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్తలు వింటారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు.

సింహారాశిపై త్రిగ్రహి కలయిక ప్రభావం పడనుంది. దీంతో ఈ రాశి వారు ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న బకాయిలు వసూలవుతాయి. ఇతరులు సాయం చేయడానికి ముందుకు వస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారితో వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు పాటించాలి.

సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలయికతో వృశ్చిక రాశి వారి జీవితంలో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆహార విషయంలో ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. చిన్న పాటి ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

ఇవే కాకుండా మరికొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. అయితే పై మూడు రాశుల వారికి ఇప్పటికే మంచి సమయాలు గడుస్తున్నాయి. ఇవి ఇంకొంతకాలం కొనసాగి మరిన్ని ప్రయోజనాలు కలిగించే అవకాశం ఉంది. సాధారణంగా మూడు గ్రహాల కలయిక చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అనుకోని అదృష్ట ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఆగస్టు 16న ఈ మూడు గ్రహాలు కలిసి కొన్ని నెలల పాటు ఉండనున్నాయి. దీంతో పై మూడు రాశుల వారు ఈ సమయంలో ఏ పని చేపట్టినా విజయమే వరిస్తుంది.