థ్రిల్లర్ మూవీలో సమంత
సమంత తన ఫ్యాన్స్ భయపెట్టేందుకు సిద్ధమవుతుంది. ‘గేమ్ ఓవర్’, ‘మాయ’ సినిమాల దర్శకుడు అశ్విన్ త్వరలో హర్రర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీని కథను ఇటీవల సమంతను దర్శకుడు అశ్విన్ సమంతకు విన్పించాడు. కథ నచ్చడంతో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీపై సమంత కామెంట్ చేసింది. ఈ మూవీ హర్రర్ తలదన్నేలా ఉంటుందని సమంత కామెంట్ చేసింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్లో జరుగనుంది. ‘ఏం మాయ చేశావే’ నుంచి సమంత […]

సమంత తన ఫ్యాన్స్ భయపెట్టేందుకు సిద్ధమవుతుంది. ‘గేమ్ ఓవర్’, ‘మాయ’ సినిమాల దర్శకుడు అశ్విన్ త్వరలో హర్రర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీని కథను ఇటీవల సమంతను దర్శకుడు అశ్విన్ సమంతకు విన్పించాడు. కథ నచ్చడంతో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీపై సమంత కామెంట్ చేసింది. ఈ మూవీ హర్రర్ తలదన్నేలా ఉంటుందని సమంత కామెంట్ చేసింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్లో జరుగనుంది.
‘ఏం మాయ చేశావే’ నుంచి సమంత ఎక్కువగా లవ్ స్టోరీల్లోనే నటించింది. అలాంటి సినిమాలే సమంత మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల సమంత-శర్వానంద్ జంటగా ‘జాను’ రిలీజైంది. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. సమంతకు నాగచైతన్యతో పెళ్లాయక గ్లామర్ రోల్స్ తగ్గించి లేడి ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యమిస్తుంది.
తాజాగా సమంత హర్రర్ మూవీకి సైన్ చేసింది. తెలుగు, తమిళం, హిందీలోనూ ఈమూవీ తెరకెక్కనుంది. గతంలోనూ సమంత చేసిన ‘రాజుగారి గది-2’ లాంటి హర్రర్ మూవీల్లో నటించింది. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో సమంత రెగ్యూలర్ లవ్ స్టోరీలపైనే దృష్టిసారించింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ హర్రర్ మూవీలో సమంత నటించనుంది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.