Rgv: నేడు ఢిల్లీలో వైభవంగా 67 వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకకు ఆయన హాజరయ్యారు. అనంతరం వెంకయ్య నాయుడు రజినీకాంత్ కు ఈ అవార్డును ప్రదానం చేసి అభినందించారు. ఇక్కడ వరకు అంతా సజావుగానే సాగింది.
కానీ ఇప్పుడు మాత్రం ఈ వేడుక గురించి అందరూ మరోసారి చర్చించుకునేలా చేసిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలిచేవారిలో ఆర్జీవి ముందుంటారు. ఇప్పుడు కూడా అలానే వెంకయ్య నాయుడు పై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు… రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందించిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆర్జీవి. కానీ ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న వెంకయ్య నాయుడును ” కొరియర్ బాయ్ ” అని అంటూ సంచలన ట్వీట్ చేశాడు వర్మ. “సూపర్ స్టార్ రజినీకాంత్ కు కొరియర్ మ్యాన్ ద్వారా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది” ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అయితే వెంకయ్యనాయుడును ఆ విధంగా సంభోదించడం పట్ల నీటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో తనదైన శైలిలో గుర్తింపు పొంది ఆ స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడును అలా అనడం పట్ల ఆయన అభిమానులంతా వర్మపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. వెంటనే వెంకయ్య నాయుడుకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Here is @rajinikanth giving award to Dada saheb Phalke through a courier man pic.twitter.com/AxKkre4Aay
— Ram Gopal Varma (@RGVzoomin) October 25, 2021