OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / రాజకీయాలు / PK Survey On TRS Leaders: అధికార పార్టీలో ఆ ఎమ్మెల్యేలు దీపం ఉండగానే భవితవ్యాన్ని చక్కబెట్టుకుంటున్నారా?

PK Survey On TRS Leaders: అధికార పార్టీలో ఆ ఎమ్మెల్యేలు దీపం ఉండగానే భవితవ్యాన్ని చక్కబెట్టుకుంటున్నారా?

Published by Bhaskar Anabothula On Wednesday, 22 June 2022, 16:51

PK Survey On TRS Leaders: మాంత్రికుడి ప్రాణం పంజరంలో ఉన్న చిలకలో ఉన్నట్టు.. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల భవితవ్యం పీకే సర్వే రిపోర్ట్ లో ఉంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దాకా పదేపదే పీకే సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్లు ఇస్తామని చెబుతుండడంతో ప్రస్తుత ఎమ్మెల్యేల్లో గుబులు పట్టుకుంది. ఈ క్రమంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీలతో టచ్ లో ఉంటున్నారు. అంగబలం అర్థబలం మెండుగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను అని తెరవెనుక ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి పీకే సర్వే రిపోర్ట్ అనేది బయటకి వెల్లడించక పోయినా లీకుల ద్వారా సమాచారం తెలుసుకున్న సదరు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల నాటి దాకా వేచి చూసి టిక్కెట్ రాకుంటే అప్పుడు ఏదో ఒక పార్టీలో చేరి పోటీలో నిలబడ్డామని యోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బలం 80 స్థానాలు పైచిలుకే. ఈ స్థానాల్లో 35 మంది దాకా తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న టుడే పీకే తన సర్వేలో కేసీఆర్కు నివేదించారు. వీరిని తప్పిస్తేనే పార్టీకి ప్రయోజనం ఉంటుందని వివరించారు. ఇటీవల ప్రగతి భవన్ లో నిర్వహించిన టిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ పదేపదే ఇదే విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా హైదరాబాదులో ఉండదు మీ నియోజకవర్గంలోనే ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయండి అంటూ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్లు తెలిసింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి 2018 ఫలితాలు వస్తాయని సర్వే రిపోర్టులు వెల్లడించడం టిఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

PK Survey On TRS Leaders

KCR, PK

ఎందుకు ఈ వ్యతిరేకత

2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాల్టి వరకు మేము గొప్పగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేపదే చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మెజారిటీ వర్గం టిఆర్ఎస్ కార్యకర్తలు జైల్లోకి వెళుతున్నాయి. పైగా ప్రభుత్వం ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక మొదట్లో అధికారులకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో ఆ పథకం నిర్వహణ గాడి తప్పింది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పథకానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ఇక డబుల్ బెడ్రూం పథకాన్ని సంబంధించి ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి ఇప్పటివరకు కట్టి ఇచ్చిన ఇల్లు 17 వేలు మాత్రమే. ఈ పథకం కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించినట్టు రాష్ట్రం చెబుతుండడం గమనార్హం. ఇక మిషన్ భగీరథ, గొర్రెల పంపిణీ పంపిణీ పథకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ప్రభుత్వం గత మూడేళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో ఆయా వర్గాల్లో తీవ్ర ఆగ్రహం నెలకొని ఉంది.

Also Read: BJP presidential candidates: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికే విభిన్నం.. వారి గురించి తెలిస్తే ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే..

పెట్రేగిపోతున్న ఎమ్మెల్యేలు

వాస్తవానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్రమైన తలనొప్పులు తెచ్చి పెడుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నుంచి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వరకు అందరూ కూడా భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వీరిలో కొందరు అయితే అత్యాచారాలకు తెగబడుతున్నారు. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకంగా ఒక యువతి లోబర్చుకొన్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. మన జూబ్లీహిల్స్ మైనర్ పై జరిగిన అత్యాచారం ఘటన లో ఒక బోర్డ్ చైర్మన్, అధికార పార్టీకి అత్యంత ప్రీతిపాత్రమైన మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యే ఉండటం.. ఘటనపై టిఆర్ఎస్ పార్టీ నిదానంగా చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో విమర్శలకు తావిచ్చింది.

PK Survey On TRS Leaders

PK, KCR

కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లకు టికెట్లు దాదాపుగా లేనట్టే

2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, హరిప్రియ నాయక్, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు (టిడిపి), సండ్ర వెంకటవీరయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి.. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో ఒకరి తప్ప మిగతా వాళ్లందరికీ కూడా టిఆర్ఎస్ రిక్త హస్తం చూపించే యోచనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి టికెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో చాలామంది కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలోని నాయకులు వీరిని తీసుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ తరహా గోడమీద పిల్లి ఇలాంటి రాజకీయాలు చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటున్నట్టు సమాచారం. వీరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు కూడా నిధులను అంతంతమాత్రంగానే విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నీమధ్య ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను కోరితే నిర్ద్వందంగా తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. పైగా ఇంకోసారి తనని కలవద్దని ముఖంమీద చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ ఎమ్మెల్యే ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులతో అంటకాగుతున్నట్టు వినికిడి. అధిష్టానం ఎలాగూ తమను పావులుగా వాడుకున్నదని, ఎన్నికల టికెట్ అయిపోతే తాము కూడా వేరే దారి చూసుకుంటామని సదరు ఎమ్మెల్యేలు వారి వారి అంతరంగికులతో చెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

Also Read:BJP Operation Kamalam In Country: మోడీ వచ్చాక దేశంలో కూల్చిన ప్రభుత్వాలెన్ని?

లైఫ్ స్టైల్

Truths In The World: ప్రపంచంలో సత్యాలు.. మన కళ్ల ముందే జరుగుతున్న మనం గుర్తించని నిజాలు!

Team India Ready For first T20 Against England: ఇంగ్లండ్ తో తొలి టీ20 పోరుకు టీమిండియా సిద్ధం.. ఇరు జట్ల బలాబలాలివీ!

Rainy Season: వర్షాకాలంలో ఆ నాలుగు కూరగాయలు తినకూడదా?

TVS Ronin 2022: గంటకు 120 కి.మీ.ల వేగం..అడ్వాన్స్ ఫీచర్స్: మార్కెట్లోకి TVS రోనిన్..

MS Dhoni Love Story: ధోని-సాక్షి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా?

Electric Vehicles: ‘ఈ’-బండి జోరు పెరుగుతోంది

Virat Kohli: విరాట్ కోహ్లిపై వేటు వేసేందుకే ఈ షాకింగ్ నిర్ణయమా?

India vs England 5th Test: ఇంగ్లండ్ పై టీం ఇండియా ఓటమికి కారణాలు ఇవే

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Leena Manimekalai : దేవుళ్లతో గేమ్స్: నిన్న స్మోకింగ్ కాళీ, నేడు స్మోకింగ్ శివపార్వతులు.. లీనా పెనుదుమారం

Truths In The World: ప్రపంచంలో సత్యాలు.. మన కళ్ల ముందే జరుగుతున్న మనం గుర్తించని నిజాలు!

Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Gorantla Rajendraprasad Away: చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Alia Bhatt: ఫస్ట్ నైట్ పై ఓపెన్ గా చెప్పేసిన ఆలియా భట్.. వైరల్

A period of decay: కుళ్ళిపోవడానికి ఎవరికి  ఎంత సమయం పడుతుంది?

మరిన్ని చదవండి ...

గాసిప్

Naga Chaitanya Samantha: ప్రేమించడం నేర్పించింది నువ్వే.. నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్ వైరల్

Acharya Koratala Shiva: ‘ఆచార్య’తో నష్టపోయిన వారికి ఆస్తులమ్మి చెల్లిస్తున్న కొరటాల శివ!?

Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?

Viral: విడాకులకు సిద్ధమైన ముగ్గురు ప్రముఖ హీరోలు!?

BJP Venkaiah Naidu: వెంకయ్య కాకపోయే.. ఆ మీడియా, ఆ సామాజికవర్గం గగ్గోలు

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA: తానా ఆధ్వర్యంలో అమెరికాలో మొట్టమొదటి ‘ఉచిత కంటి వైద్య శిబిరం’

Viral: లాటరీ ఇలా తగిలితే దరిద్రం పోతుంది.. ఇతడు ఎంత గెలిచాడో తెలుసా?

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Saptakhanda Awadhana Sahitya Jhari ‘ అంగరంగంగా వైభవంగా ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap