OK Telugu

- Politics, Movies, AP, Telangana

  • హోం
  • రాజకీయాలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సంపాదకీయం
  • సినిమా
    • బిగ్ బాస్ 5 అప్‌డేట్స్
    • సినిమా రివ్యూస్
    • అప్ కమింగ్ మూవీస్
    • అప్పటి ముచ్చట్లు
    • స్టార్ సీక్రెట్స్
  • బ్రేకింగ్ న్యూస్
  • లైఫ్‌స్టైల్
  • విద్య / ఉద్యోగాలు
  • 2021 రౌండ్ అప్
  • English
You are here: Home / రాజకీయాలు / Pawan Kalyan: శ్రమదానం.. వైసీపీపై పవన్ ఎక్కుపెట్టిన అస్త్రం

Pawan Kalyan: శ్రమదానం.. వైసీపీపై పవన్ ఎక్కుపెట్టిన అస్త్రం

Published by Naresh On Sunday, 24 October 2021, 20:26

• సగటు మనిషి అభివృద్ధి… తద్వారా రాష్ట్రాభివృద్ధే జనసేన లక్ష్యం
• జిల్లాల్లో పర్యటనలు చేపట్టి పార్టీ సమీక్షలు నిర్వహిస్తా
• జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు  పవన్ కల్యాణ్ 

జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలోని అధికార వైసీపీపై మరోసారి గురిపెట్టారు. ఏపీ రోడ్ల దుస్థితిపై పోరాటం మొదలుపెట్టారు. శ్రమాదానంతో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కళ్లకు గట్టబోతున్నాడు. రహదారుల సమస్యను ప్రజల మద్దతుతో ఎలుగెత్తి చాటి సమస్య పరిష్కారం కోసం పాటుపడనున్నారు. ఈ మేరకు పవన్ తన పార్టీ నేతలతో కలిసి కీలక సమీక్ష చేపట్టారు.

pawan kalyan

pawan kalyan

జనసేన పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజానీకం కష్టాలను, వారి నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా ఉండాలని పార్టీ అధ్యక్షులు  పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లి… కనీసం మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అప్పుడే శ్రమదానం ద్వారా మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారాన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చింది… శ్రమదానం స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా, మండల స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఆ పరిధిలో దెబ్బ తిని ఉన్న ఒక రోడ్డుకు మరమ్మతు చేయాలని సూచించారు. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది మన పార్టీ లక్ష్యం. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికీ భయపడేది లేదు. ఏ అంశాన్నైనా ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం. ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నాం. జిల్లాకు వెళ్ళినప్పుడే అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తాను” అన్నారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “పార్టీ శ్రేణులను జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకొంటూ మన అధ్యక్షుల వారి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించాలి. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను ప్రభావవంతంగా నిర్వహించాల”ని చెప్పారు. పార్టీ మండల, గ్రామ స్థాయి కమిటీల నియామకానికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

• త్వరలో మండలాధ్యక్షులు, కమిటీల నియామకం
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్పిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలోకి నిలపాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారని పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ప్రతి డివిజన్, వార్డుల్లో జనసేన అభ్యర్ధులను నిలబెట్టి వారి విజయం కోసం కృషి చేయాలని సూచించినట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లాల అధ్యక్షులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించారు. ఉదయం 11గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సమీక్షా సమావేశం కొనసాగింది. జిల్లాల అధ్యక్షులు ఇచ్చిన నివేదికలను సమీక్షించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం శ్రీ కందుల దుర్గేష్, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. వరుణ్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డిలతో కలసి సమావేశం వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గేష్ మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షుల వారితో జరిగిన సమీక్షా సమావేశంలో తొమ్మిది అంశాలపై తీర్మానం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులను నియమించిన జిల్లాల్లో నవంబర్ 15వ తేదీ నాటికి పార్టీ మండలాధ్యక్షులు, మండల కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మొత్తం 15 రోజులలో పూర్తి చేయాలని అధ్యక్షుల వారు ఆదేశించారు. త్వరలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జిల్లాల పర్యటనలు ప్రారంభం కానున్నాయి. పర్యటనల్లో భాగంగా అధ్యక్షుల వారు ప్రతి జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షిస్తారు. అనంతరం కార్యాచరణకు రూపకల్పన చేస్తారు.

దీంతో పాటు జిల్లాలవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇసుక తవ్వకాలు, అక్రమ మైనింగ్, పోలీస్ శాఖకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రోజు 144 సెక్షన్, సెక్షన్ 30లు అమల్లో ఉండడం, చిన్నపాటి వినతిపత్రం ఇవ్వడానికి కూడా పోలీసులు అడ్డగించి, ఇబ్బందులుపెట్టడం వంటి అంశాలు, శాంతి భద్రతల అంశాలను పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చాం.
ప్రభుత్వ పథకాల అమలు వ్యవహారంలో ఫించన్లు ఆపివేయడం, రేషన్ కార్డులు ఎత్తివేయడం, అమ్మ ఒడి వాయిదా వేయడం లబ్దిదారులకు న్యాయంగా అందాల్సిన లబ్ది రాకపోవడం వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. జిల్లాల వారీగా ప్రత్యేకంగా ఉన్న సమస్యలపై జనసేన శ్రేణులు పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది. స్థానిక సమస్యల మీద పోరాటం చేయాలని, రాష్ట్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేసి ఒక నోట్ తయారు చేసి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గానికి పంపాలని అధ్యక్షుల వారు సూచించారు. దీంతో పాటు పార్టీ క్రియాశీలక సభ్యులను బలోపేతం చేసే దిశగా వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం” అన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వర రావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవింద రావు, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.

లైఫ్ స్టైల్

Meat: తెలుగు రాష్ట్రాల్లో మంసాహార ప్రియులు ఎంత మందో తెలుసా?

Rajat Patidar: వద్దనుకున్న ప్లేయర్ ఆర్సీబీని సెమీస్ చేర్చాడు.. పటీదార్ పై ప్రశంసల జల్లు

IPL 2022 Eliminator: ఐపీఎల్: ఆర్సీబీ సెమీస్ కు.. లక్నో కొంప ముంచింది ఏంటి?

Iron- Deficiency: ఐరన్ లోపం ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయా?

Hardik Pandya : హార్ధిక్ పాండ్యానే టీమిండియా భవిష్యత్ కెప్టెన్ నా?

IPL 2022 Rain Threat: ఐపీఎల్ ఫైనల్ మ్యాచులకు వానగండం.. కొత్త నిబంధనలు పెట్టిన బీసీసీఐ

Chanakya Niti for Success: చాణక్య నీతి: రోజును ఎలా ప్రారంభిస్తే విజయాలు దక్కుతాయి?

Chanakya Niti: చాణక్య నీతి: ఇలా చేస్తే ఎంతటి శత్రువైనా మీ ముందు తల వంచాల్సిందే!

మరిన్ని చదవండి ...

Advertisements

అప్పటి ముచ్చట్లు

Renu Desai: రేణుదేశాయ్ ను పిలిస్తే.. వచ్చి క‌మిట్‌మెంట్ గురించి చెప్పింది

NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?

S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

Carzy Update: ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తాను ?.., నీ అంతు తేలుస్తా ఈ రోజు !

Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

మరిన్ని చదవండి ...

వైరల్ అడ్డా

Jabardasth Kiraak RP Engagement Photos: ప్రేమించిన అమ్మాయితోనే కిరాక్ ఆర్పీ ఎంగేజ్ మెంట్.. ఆమె ఎవరో తెలుసా?

Sonu Sood: సీమ పట్ల ఔదార్యం చూపుతున్న సోనూసూద్

Captain Abhilasha Barak: యుద్ధరంగంలోకి తొలి మహిళా పైలెట్‌.. చరిత్ర సృష్టించిన అభిలాష

Japan Man Turn Into Dog: కుక్కగా మారిన జపాన్ వ్యక్తి.. ఏకంగా రూ. 12 లక్షల ఖర్చు

Poonam Bajwa : పూనమ్ ఎక్సర్ సైజ్.. చూస్తే మీకు చమటలు పడుతాయి!

Esther Anil : ‘దృశ్యం’ సినిమాలోని ఆ పాప అందాలు చూడతరమా?

మరిన్ని చదవండి ...

గాసిప్

Konaseema Agitation: ‘కోనసీమ’ మంటల్లో ‘జగన్’ ఫోటో ఎందుకు కాలలేదు..? ఆ రహస్యమేంటబ్బా?

Sarkaru Vaari Paata: పాలిటిక్స్ లో ఇరుక్కొని ‘సర్కారువారి పాట’ ఫ్లాప్ అయ్యిందా?

సర్కారివారి పాట సాంగ్ కూడా కాపీయేనా? తమన్ ఎక్కడి నుంచి కాపీ కొట్టాడో తెలుసా?

Twitter employees: ట్విట్టర్ ఉద్యోగుల్లో ఆందోళన.. మస్క్ నిర్ణయంతో భయం?

Rajamouli-Pawan Kalyan movie: రాజమౌళి-పవన్ కళ్యాణ్ మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

మరిన్ని చదవండి ...

ప్రవాస భారతీయులు

TANA ‘Amma Nanna Sambaralu’ : ‘అమ్మానాన్న’లపై ప్రేమను చాటిన ‘తానా’

America Gun Fire: అమెరికా లో తుపాకీ విలయం.. 22 మంది విద్యార్థుల దుర్మరణం.. ఎందుకీ ఉన్మాదం?

US Green Card: అమెరికాలోని ప్రవాస భారతీయులకు శుభవార్త… గ్రీన్ కార్డు జారీ వేగవంతం

Sree sitarama kalyanam in Canada  : సీతారామ కళ్యాణంతో పరవశించిన డుర్హం

Sri Sitaram’s kalyanam in Canada : ‘తాకా’ ఆధ్వర్యంలో కెనడాలో అంగరంగ వైభవంగంగా శ్రీ సీతారాముల కళ్యాణం

మరిన్ని చదవండి ...

Copyright © 2019-2021 · Ok Telugu


Follow us on


OKtelugu.com is an online media owned by Indus media partner LLC. Technology Support by CultNerds IT Solutions.
OKTelugu provides latest Telugu Live News, Political News, Movie News and Viral News for AP & Telangana Audience.
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap