TANA: తానా కళాశాల, న్యూ ఇంగ్లండ్‌ ఆధ్వర్యంలో కూచిపూడి ప్రదర్శన

కూచిపూడి నృత్య ప్రదర్శనను వీక్షించేందుకు 400 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. నృత్య ప్రదర్శన అనంతరం తానా మాజీ కోశాధికారి అమ్మని దాసరి తానా కళాశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ పద్మావతి యూనివర్సిటీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

Written By: Raj Shekar, Updated On : June 8, 2024 11:33 am

TANA

Follow us on

TANA: తానా కళాశాల, న్యూ ఇంగ్లండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారామ కల్యాణం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. శైలజా చౌదరి ఆధ్వర్యంలో తానా కళాశాలలో 200 మంది విద్యార్థులు చేసిన ఈ నృత్యం వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణ వెంపటి కవితాగానం, వడలి ఫణి నారాయణ సంగీత కొరియోగ్రఫీ, శైలజా చౌదరి తుమ్మల కళాత్మక దర్శకత్వం, కొరియోగ్రఫీ ప్రేక్షకులను కట్టిపేశాయి.

400 మంది హాజరు..
ఈ కూచిపూడి నృత్య ్ర›పదర్శనను వీక్షించేందుకు 400 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. నృత్య ప్రదర్శన అనంతరం తానా మాజీ కోశాధికారి అమ్మని దాసరి తానా కళాశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ పద్మావతి యూనివర్సిటీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

గ్రేటర్‌ బోస్టన్‌లో నృత్య కళాశాల..
ఇదిలా ఉండగా శైలజా చౌదరి తుమ్మల గ్రేటర్‌ బోస్టన్‌లోని శ్రీ కూచిపూడి నాట్యాలయం, తానా కళాశాల న్యూ ఇంగ్లండ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పద్మశ్రీ డాక్టర్‌ శోభానాయుడు దగ్గర నాట్య శిక్షణ అభ్యసించారు. 24 ఏళుల్గా వృత్తిరిత్యా కూచిపూడి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 34 ఏళ్లుగా ప్రదర్శనలు ఇస్తున్నారు.

కార్యక్రమానికి వీరు..
ఇక ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనకుతెలుగు గ్రేటర్‌ బోస్టన్‌ అధ్యక్షురాలు దీప్తి గోరా, శ్రీనివాస్‌ గొండి, శివ డోకిపర్తి, చంద్ర రెడ్డివారి, సురేశ్‌ దగ్గుబాటా, రామకృష్ణ కొల్లా, కీర్తి తొగరు, సాయి లక్ష్మి, ఉమా కంతేటి, అనంతా జయం, మాధవి పోరెడ్డి, రజిని దగ్గుబాటి, కోటేశ్‌ కందుకూరి, సూర్య తేలప్రోలు, రమణ బిల్లకంటి, సురేశ్‌ సూరపరాజు, మురళి పసుమర్తి దతితరులు హాజరయ్యారు.