
Nityananda Swamy
Nityananda Swamy: ఏ దేశం ఎక్కడ ఉంది. ఏ దేశం సరిహద్దు ఏమిటి.. వనరులు ఏమిటి.. సైనిక బలం.. అస్త్ర శస్త్రాలు ఏమిటి అని ప్రపంచ దేశాలపై నిఘా పెట్టే అగ్రరాజ్యాం అమెరికానే బురిడీ కొట్టించాడు మన వివాదాస్పద గురువు నిత్యానంద. తమది ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ దేశమని, సాంస్కృతిక ఒప్పందాలు చేసుకుందామని తమ ప్రతినిధులను అమెరికాకు పంపించాడు. వాళ్లు కూడా స్వామీజీ పంపిప ప్రతినిధులు నిజమైన వాళ్లేనా.. అసలు ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ అనే దేశం ఉందా అని ఆలోచన కూడా చేయలేదు. చకచకా పత్రాలపై సంతకాలు చేశారు. కానీ, అసలు విషయం ఆలస్యంగా తెలుసుకుని తెల్లముఖం పెట్టారు.
దేశం నుంచి పారిపోయి..
వివాదాస్పద గురువు నిత్యానంద అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దికాలం క్రితం భారత్ నుంచి పారిపోయిన ఈయన.. ఓ ఐలాండ్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికే ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’ అని పేరుపెట్టుకున్నాడు. ఇదే తన దేశమని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస ప్రతినిధులు పాల్గొని భారత్కు వ్యతిరేకంగా ప్రసంగించారు. వీరి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.

Nityananda Swamy
నెవార్క్ నగరంలో ఒప్పందం…
అయితే ‘సిస్టర్ సిటీ’ పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతోపాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది.

Nityananda Swamy
అసలు విషయం తెలిసి..
కానీ అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.