
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,461 పరీక్షలు నిర్వహించగా 1,321 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,10,566 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 1,499 మంది బాధితులు కోలుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,81,906కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,64,71,272 నమూనాలను ఆరోగ్యశాఖ పరీక్షించింది. గడిచిన 24 గంటల్లో 19 మంది మృతి చెందారు.