Nayanthara-Vignesh surrogate : లాజిక్ మిస్సింగ్: ఆరేళ్ల క్రితమే నయనతార-విఘ్నేష్ పెళ్లి జరిగిందట.. సరోగసీతో ఇప్పుడు కన్నారట.?

Nayanthara-Vignesh surrogate : నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య సరోగసీ వివాదం కొత్త మలుపు తిరిగింది. నయనతార, విఘ్నేష్ తమకు కవల మగపిల్లలు ఉన్నారని గత ఆదివారం వెల్లడించారు. ఈ జంట దానిని ధృవీకరించనప్పటికీ.. సరోగసీని ఉపయోగించుకొని వీరిద్దరూ పిల్లలను కన్నారని పుకార్లు ఇంటర్నెట్ చర్చకు దారితీశాయి. తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ ఈ నయనతార జంట సరోగసి విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఈ విధానంలో పిల్లలు కనడంపై అభ్యంతరాలున్నాయి. దీనిపై విచారణ […]

  • Written By: NARESH
  • Published On:
Nayanthara-Vignesh  surrogate : లాజిక్ మిస్సింగ్: ఆరేళ్ల క్రితమే నయనతార-విఘ్నేష్ పెళ్లి జరిగిందట.. సరోగసీతో ఇప్పుడు కన్నారట.?

Nayanthara-Vignesh surrogate : నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య సరోగసీ వివాదం కొత్త మలుపు తిరిగింది. నయనతార, విఘ్నేష్ తమకు కవల మగపిల్లలు ఉన్నారని గత ఆదివారం వెల్లడించారు. ఈ జంట దానిని ధృవీకరించనప్పటికీ.. సరోగసీని ఉపయోగించుకొని వీరిద్దరూ పిల్లలను కన్నారని పుకార్లు ఇంటర్నెట్ చర్చకు దారితీశాయి.

తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ ఈ నయనతార జంట సరోగసి విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఈ విధానంలో పిల్లలు కనడంపై అభ్యంతరాలున్నాయి. దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు.

నయనతార, విఘ్నేష్ శివన్‌ల నుంచి తమిళనాడు ఆరోగ్య శాఖ అఫిడవిట్‌ను స్వీకరించినట్లు సమాచారం. నయనతార, విఘ్నేష్ తమ వివాహాన్ని ఆరేళ్ల క్రితం రిజిస్టర్ చేసుకున్నారని అఫిడవిట్‌లో తేలింది. ఈ జంట తమ వివాహ లైసెన్స్‌ను కూడా అఫిడవిట్‌తో చేర్చారు.

కవలలు ప్రసవించిన చెన్నై ఆసుపత్రిని రాష్ట్ర యంత్రాంగం గుర్తించినట్లు పుకార్లు వచ్చాయి. సరోగసి తల్లి నయనతార యొక్క బంధువు అనే విషయం కూడా ఈ జంట ద్వారా స్పష్టంగా వెల్లడైంది. ఆమె యూఏఈలో నివసిస్తోందని సమాచారం..

సరోగసీ చట్టం -2021ని అనుసరించి.. సరోగసీని ఉపయోగించాలనుకునే ఏ జంట అయినా తప్పనిసరిగా ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వివాహమై ఉండాలి.. సరోగసీ విధానంలో బిడ్డను కనే మహిళ.. తల్లిదండ్రులకు దగ్గరి బంధువు అయి ఉండాలి. నయనతార -విఘ్నేష్ శివన్ ఈ నిబంధనల వెలుగులో అన్ని నియమాలు , విధానాలను ఖచ్చితంగా పాటించారని పేర్కొన్నారు.

అందరికీ తెలిసిన నిజం ఏంటంటే.. నయనతార -విఘ్నేష్ శివన్ జంట ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 9న నయనతార, విఘ్నేష్ శివన్‌లు మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో వివాహ వేడుక చేసుకున్నారు. చెన్నై కి దూరంగా మహాబలిపురంలో కొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి అయ్యి ఐదు నెలలకే కవలలకు తల్లిదండ్రులయ్యారు. మరి పెళ్లి అయి ఐదేళ్ల తర్వాతే బిడ్డలు కనాలనే నిబంధనను వీరిద్దరూ ఎలా పాటించారన్నది ఇక్కడ ప్రశ్న. ఇదే వివాదాస్పదమవుతోంది. కానీ ఈ జంట ఆరేళ్ల క్రితమే వివాహాన్ని రిజిస్ట్రర్ చేసుకున్నట్టు అఫిడవిట్ లో ఉండడంతో ఇది వివాదమవుతోంది.

వివాహ వేడుక ప్రైవేట్‌గా జరిగినప్పటికీ.. వీక్షకులు వీరి వివాహ వీడియోను నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ లో చూశారు. అత్యంత వైభవంగా ఇది జరిగింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ పెళ్లి కార్యక్రమం, జంట ప్రేమ ప్రయాణం , వివాహ ప్రణాళికను వీక్షకులకు అందించే కొన్ని టీజర్‌లను ఇప్పటికే విడుదల చేయగా వైరల్ అయ్యింది. మరీ వీరి సరోగసిలో నిబంధనలు పాటించారా? ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కన్నారా అన్నది తేలాల్సి ఉంది.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు