పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషాదంలో మునిగారు. ఆమె వ్యక్తిగత సహాజయకుడు మణిక్ మజుందాన్ శనివారం మరణించారు. కోల్ కతాలోని కాళీఘాట్ కార్యాలయంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా త్రుణమూల్ కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించిన మణిక్ మరణంతో మమతా షాక్ కు గురయ్యారు. దీంతో ఆమె మణిక్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘మణిక్ మరణంతో నాకెంతో బాధను కలిగించింది. శ్రద్ధగా పనిచేసే మజుందార్ లేని లోటు పూడ్చలేనిది’ అని మమతా తెలిపారు. కాగా మజుందర్ కొన్ని వారాల కిందట కరోనా బారిన పడ్డారు.