దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 140 పాయింట్ల లాభంతో 42,738 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 12,498 వద్ద సాగాయి. ఇండియన్ హోటల్స్, పీవీఆర్ లిమిటెడ్, యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. ఎన్ వోసీఐఎల్, బేయర్ క్రాస్ సైన్స్ల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కాగా ఫైజర్ సంస్థ ఆధ్వర్యంలో టీకా విజయవంతం అయిందని ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లలో ఊపు వచ్చాయని అనుకుంటున్నారు.