
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రూ. 75 కాయిన్ను విడుదల చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనేజేషన్( ఎప్ఏవో) 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ కాయిన్ను రిలీజ్ చేశారు. అలాగే 17 రకాల కొత్త పంటలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలతో రైతులకు మేలు లుగుతుందన్నారు.ప్రపంచ ఆహార కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అందులో భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషమన్నారు. రైతుకు కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మోదీ తెలిపారు.