కరోనా భయంతో ఫిజియోథెరపిస్టు ఆత్మహత్య
కరోనా సోకిందన్న భయంతో ఓ ఫిజియోథెరఫిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి వెల్లూరు కు చెందిన చిన్నస్వామి బెంగుళూరు అపోలో ఆసుపత్రిలో ఫిజియోథెరఫిస్టుగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే తనకుకరోనా సోకిందనే భయంతో బెంగుళూరు లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఓ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదంగా మారింది. చిన్నస్వామికి భార్య ఉమాపతి, ఒక కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం […]
Written By:
, Updated On : November 11, 2020 / 11:54 AM IST

కరోనా సోకిందన్న భయంతో ఓ ఫిజియోథెరఫిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి వెల్లూరు కు చెందిన చిన్నస్వామి బెంగుళూరు అపోలో ఆసుపత్రిలో ఫిజియోథెరఫిస్టుగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అయితే తనకుకరోనా సోకిందనే భయంతో బెంగుళూరు లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఓ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదంగా మారింది. చిన్నస్వామికి భార్య ఉమాపతి, ఒక కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నట్లు పోలీులు తెలిపారు.