యూపీలో ఘోర అగ్ని ప్రమాదం: మంటల్లో చిక్కకున్న మురికివాడలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం సంభవించింది. సహిబాబాద్ ప్రాంతంలోని భూపురా క్రుష్ణ విహార్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 మురికివాడలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 వాహనాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గురైన ఇళ్లపై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగినట్లు తమకు తెలిసిందని,   వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం పంపించామని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే మంటలను అదుపు చేసేందుకు […]

Written By: Suresh, Updated On : November 4, 2020 8:47 am
Follow us on

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం సంభవించింది. సహిబాబాద్ ప్రాంతంలోని భూపురా క్రుష్ణ విహార్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 మురికివాడలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 వాహనాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదానికి గురైన ఇళ్లపై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగినట్లు తమకు తెలిసిందని,   వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం పంపించామని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా క్రుషి చేస్తున్నామని ఎస్సీ నీరజ్ కుమార్ తెలిపారు.