ఏవోబీలో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోయిస్టుల మృతి

మావోయిస్టు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా సింగారం ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కొందరు తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత కొంతకాలంగా మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల జరిపిన కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్, మరో పౌరుడు మరణించారు. కాగా ఏవోబీలోని కటాఫ్ ఏరియాలో పోలీసులకు, మావోయిస్టులు ఎదురయ్యారు. దీంతో ఎదురెదురు కాల్పలు జరపడంతో ముగ్గురు […]

Written By: Velishala Suresh, Updated On : December 13, 2020 10:39 am
Follow us on

మావోయిస్టు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా సింగారం ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కొందరు తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత కొంతకాలంగా మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల జరిపిన కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్, మరో పౌరుడు మరణించారు. కాగా ఏవోబీలోని కటాఫ్ ఏరియాలో పోలీసులకు, మావోయిస్టులు ఎదురయ్యారు. దీంతో ఎదురెదురు కాల్పలు జరపడంతో ముగ్గురు అక్కడికక్కమే మరణించారు. ఘటనా స్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.