Homeజాతీయం - అంతర్జాతీయంప్రముఖ నటుడు సౌమిత్ర చటర్జీ ఇక లేరు

ప్రముఖ నటుడు సౌమిత్ర చటర్జీ ఇక లేరు

ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్ర చటర్జీ కరోనాతో మృతి చెందారు. అక్టోబర్ లో కరోనా బారిన పడ్డ ఆయన చికిత్స కోసం అదే నెలలో 6న కోలకతాలోని ఆసుపత్రిలో చేరారు. తాజాగా చటర్జీ ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం కన్నుమూశారు. 85 ఏళ్ల సౌమిత్ర చటర్జీ నట జీవితంలో 300 లకు పైగా చిత్రాల్లో నటించారు. నాటకకర్త, రంగస్థల నటుడు, కవిగా కూడా పేరు తెచ్చుకున్నారు. 1959లో సౌమిత్ర సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత అభిజాన్, చారులత వంటి అనేక చిత్రాల్లో దర్శక త్వం వహించారు. సౌమిత్ర ఛటర్జీకి భారత ప్రభుత్వం 2004లో పద్మభూషన్ పురస్కారం ప్రదానం చేసింది. అలాగే సినీ రంగంల అత్యున్నత భారతీయ పురస్కారమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డును 2012లో అందించింది. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పటి వరకు దేశంలో ఎందరో సినీ ప్రముఖులు కరోనాతో మరణించారు. తాజాగా చటర్జీనీ సైతం కరోనాను బలి తీసుకోవడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version