కన్నీరు పెట్టుకున్న మోడీ!

  • Written By:
  • Updated On - March 7, 2020 / 03:39 PM IST


భారత్ ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగానికి గురైయ్యారు. జన ఔషధి లబ్ధిదారులతో ఈ రోజు ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంలో ఒక మహిళా లబ్ధిదారు (దీపా షా) మాటలకు ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం (పిఎంబిజెకె)” ద్వారా తనకెంతో మేలు జరుగుతుందని, అందుకు మీకు(మోడీ) రుణపడి ఉంటామని కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఆమె అన్న మాటలకు మోడీ కూడా కన్నీరు పెట్టుకున్నారు.

పేదవారికీ నాణ్యమైన మందులు, అతి తక్కువధరకే ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని (పిఎంబిజెకె) ఫార్మా అడ్వైజరీ ఫోరం(బిపిపిఐ) దేశంలోని వివిధ జిల్లాల్లో ప్రారంభించింది. ఈ పిఎంబిజె కేంద్రాలలో ప్రజలకు అవసరమైన మందులను 60-80% వరకు తగ్గించి ఇస్తారు.