గీత ఆర్ట్స్ బ్యానర్లో మహేష్ మూవీ?

  • Written By:
  • Updated On - February 20, 2020 / 11:13 AM IST

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా నిర్మాత అల్లు అరవింద్ కలయికలో త్వరలోనే ఈ మూవీ రాబోతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్లో మహేష్ బాబుతో మూవీ చేసేందుకు అల్లు అరవింద్ సన్నహాలు చేస్తున్నాడు. సూపర్ స్టార్, మెగా నిర్మాత కలయికలో వచ్చే మూవీని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

కేజీఎఫ్ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అగ్ర దర్శకుడిగా మారాడు. కేజీఎఫ్ మూవీ విడుదలైన అన్ని భాషల్లో బాక్సీఫీస్ రికార్డులు సృష్టించింది. ప్రశాంత్ నీల్ ఇటీవల మహేష్ బాబుకు ఓ కథను విన్పించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మెగా నిర్మాత అల్లు అరవింద్ వద్దకు ఈ కథను తీసుకెళ్లగా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సూపర్ స్టార్ మెగా కాంపౌండ్లో పని చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అల్లు అరవింద్ మహేష్ బాబుతో సినిమా తీసేందుకు ప్రయ్నతాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 మూవీ షూటింగ్లో బీజీగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. అదేవిధంగా మహేష్ బాబు వంశీ పైడిపల్లితో మూవీ చేయనున్నాడు. ఈ రెండు మూవీలు పూర్తయ్యేనాటికి గీత ఆర్ట్స్ బానర్లో మహేష్ మూవీ ప్రారంభం కానునుందని సమాచారం. గీత ఆర్ట్స్ బ్యానర్లో సూపర్ స్టార్ మూవీ చేయనున్నారని తెలియడంతో ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి కలుగుతుంది.