’యాస్‘ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన

యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా 21 లక్షల మందికిపైగా ప్రభావం చూపింది. ఈ క్రమంలో తుఫాను ప్రభావంపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మొదట ఢిల్లీ నుంచి భువన్వేశ్వర్ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ సమీక్ష జరిపి, బాలాసోర్, భద్రక్ తదితర ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్తారు. ఆ తర్వాత బెంగాల్ లోని పశ్చిమ మేదీనిపూర్ […]

Written By: Suresh, Updated On : May 28, 2021 7:47 am
Follow us on

యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా 21 లక్షల మందికిపైగా ప్రభావం చూపింది. ఈ క్రమంలో తుఫాను ప్రభావంపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మొదట ఢిల్లీ నుంచి భువన్వేశ్వర్ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ సమీక్ష జరిపి, బాలాసోర్, భద్రక్ తదితర ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వెళ్తారు. ఆ తర్వాత బెంగాల్ లోని పశ్చిమ మేదీనిపూర్ జిల్లాలోని కల్తెకుండకు చేరుకుంటారు. సీఎం మమతా బెనర్జీ, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.