తొలి టెస్టులాగే రెండో టెస్టుకు కూడా వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు ఆట ప్రారంభానికి ముందే అరగంట ఆలస్యం కాగా, ఇప్పుడు తాజాగా మరోసారి వర్షం అడ్డుపడింది. దాంతో అంఫైర్లు 18.4 ఓవర్ల వద్ద ఆటను నిలిపివేశారు. అప్పటికి రోహిత్ (35), రాహుల్ (10) పరుగులతో ఉన్నారు. జట్టు స్కోర్ 46/0 గా నమోదైంది. సామ్ కరన్ వేసిన 15వ ఓవర్ లో రోహిత్ మొత్తం నాలుగు బౌండరీలు బాదాడు.