కర్నూలు జిల్లా శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై ఆంక్షలు విధించారు. అన్యమత ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి ఈవో లవన్న సూచించారు. ఇటీవల ఇద్దరు యాచకులు అన్యమత చిహ్నాలు కలిగి ఉన్న ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ఈవో దీనిపై విచారణకు ఆదేశించారు. పోలీసుల సహకారంతో అన్యమత ప్రచార నిరోధానికి చర్యలు తీసుకుంటామని ఈవో ఈ సందర్భంగా చెప్పారు.