Site icon OkTelugu

ఏపీకి సంబంధించి రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

ఏపీకి సంబంధించిన రెండు కీలక బిల్లులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురువారం ఆమోదించారు. ఏపీ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రీసిటీ డ్యూటీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తు వారి కోసం వేర్వురు కమిషన్లు ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీ కమిషన్ కు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభ గతేడాది జనవరిలో ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ అందుబాటులోకి రానుంది.

Exit mobile version