భట్టి విక్రమార్కకు మంత్రి పువ్వాడ కౌంటర్

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కౌంటరిచ్చారు. భట్టి విక్రమార్క నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. శనివారం మీడియాతో పువ్వాడ మాట్లాడుతూ ఎన్జీటీ తీర్పును గౌరవించడం లేదని వెంటనే కేంద్రం ఇరు రాష్ట్రాల వాటా తేల్చాలన్నారు. ఏపీలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణమేనని, పనులు ఆపుతామని చెప్పినా జగన్ సర్కార్ మాట తప్పిందని ఆరోపించారు.

Written By: Suresh, Updated On : June 26, 2021 12:47 pm
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కౌంటరిచ్చారు. భట్టి విక్రమార్క నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. శనివారం మీడియాతో పువ్వాడ మాట్లాడుతూ ఎన్జీటీ తీర్పును గౌరవించడం లేదని వెంటనే కేంద్రం ఇరు రాష్ట్రాల వాటా తేల్చాలన్నారు. ఏపీలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ అక్రమ నిర్మాణమేనని, పనులు ఆపుతామని చెప్పినా జగన్ సర్కార్ మాట తప్పిందని ఆరోపించారు.