
కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీ నారసింహ స్వామి కొలువై ఉన్న యాదగిరి గుట్టలో లాక్ డౌన్ విధించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. నేటి నుంచి పది రోజుల పాటు అమల్లో ఉండనుంది. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నారు. లాక్ డౌన్ నుంచి పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణం, మెడికల్ షాపులు మినహాయింపు ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.